ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 23 October 2012

జాత్యాహంకారమును నిరశించాడు తెల్లదొరలను ఎదిరించాడు
భారతమాత దాస్యశృంకలాలకై తెగించాడు తన్నులు తిన్నాడు
అహింసావాదంతో అలుపెరుగని నిరాహారదీక్షలతో ఉద్యమించాడు
ఉప్పు సత్యాగ్రహం చేసాడు అణగారిన ప్రజలను జాగృతం చేసాడు
ప్రజలే పెద్దలని చెప్పాడు ఎన్నో
జైళ్ళ చిప్పకూడు తిన్నాడు
నిమ్నవర్గాలకై అల్పసంఖ్యాకులై అనుదినం నిత్యం నినదించాడు
సత్యమార్గము ఆవలింబించాడు యెల్లరి సద్గాతికై పాటుబడ్డాడు
బోసినవ్వుల బాపూజీ ఒంటిచేత్తో స్వాతంత్రం తెచ్చిచూపాడు
మతచాంధుసుల తూటాలకు 'హే రామ్' అంటూ బలయ్యాడు.

No comments: