ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Showing posts with label దీక్షిత రామాయణం. Show all posts
Showing posts with label దీక్షిత రామాయణం. Show all posts

Saturday, 29 June 2013

దీక్షిత రామాయణం
 (11వ భాగం )

Photo
రామాయణాన్ని వాల్మీకి ఎప్పుడు రాశాడనే కాల నిర్ణయం, ఏ పేరుతో రాశాడనే సదసత్ సంశయం మనకు సమస్యలు కారాదు.ఎప్పుడు రాసాడని గాక ఏమి చెప్పాడనే విషయాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఈ దివ్య గ్రంథం ద్వారా వాల్మీకి ప్రతిష్టించిన లోకోత్తర విలువలను గమనంలోకి తీసుకోవాలి.
రాముడు స్వయం ధర్మావతారుడు. ధర్మం పురుషాకృతి దాలిస్తే అది రామునిగానే సాక్షాత్కరిస్తుంది. అందుచేత రాముని ప్రతి చర్యా ధర్మ బద్ధమే అవుతుంది. రాముని చర్యలో, మాటలో, నడతలో ఎక్కడా ధర్మాధర్మ విచక్షణ మనకు అనవసరం. ఎందుకంటే రాముడే ధర్మ స్వరూపుడు. ధర్మం తాను స్వయంగా అధర్మం ఎట్లా చేయగలుగుతుంది?
ధర్మం ఒక పరిపూర్ణ పురుషునిగా అవతరించి సంపూర్ణ వ్యక్తిత్వంతో మసలితే ఎలా ఉంటుందంటే ... శ్రీరాముడ్ని చూసినట్టే ఉంటుంది.
 దీక్షిత రామాయణం

(10వ భాగం )

ఆ నరోత్తముడి దివ్య గుణగణాలు ఇవాల్టికీ లోకులకు ఆచరణ యోగ్యము, ఆచరణ సాధ్యమూ కావడానికి, వారు ఆయనను ఆదర్శంగా ఎంచి అనుసరించడానికి ఆయన మానవుడే కావడం దోహదం చేసింది.

రామాదుల వల్లనే, రామాయణం వల్లనే ఇవాల్టికీ లోకంలో మంచి అనేది కొంతైనా మిగిలి ఉంది. రామాయణమే లేకుంటే, రామాయణం పై జనులకు విశ్వాసమే లేకుంటే సమాజంలో నైతిక విలువలు, కుటుంబ విలువలు, మానవ సంబంధాలు ఈపాటికే పూర్తిగా లుప్తం అయిపోయి ఉండేవి. మానవుడనే వాడు మచ్చుకైనా కనిపించని పరిపూర్ణ దానవ సమాజమే దాపురించి ఉండేది. అందుకే శ్రీమద్రామాయణం సర్వ మానవాళికీ ఆదర్శనీయ గ్రంథం. ఇందలి ధర్మాలు సర్వ లోకాలకూ, సర్వ కాలాలకూ అనుసరణీయాలు. ఇందలి నాయకుడు శ్రీరామచంద్రుడు సర్వులకూ సర్వదా ఆరాధ్యనీయుడు
 దీక్షిత రామాయణం

(9వ భాగం )
 Photo

ఎందరో ఉత్తములు రామాయణాన్ని తిరిగి చెప్పగా, మరెందరో వ్యాఖ్యానాలు రాశారు. సంస్కృతంలో వశిష్ట రామాయణం, ఆనంద రామాయణం, అగస్త్య రామాయణం, ఆధ్యాత్మ రామాయణం (వ్యాస విరచిత బ్రహ్మాండ పురాణాంతర్గతం) ఉంటే, తెలుగులో మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, రంగనాథరామాయణం వంటివి ఉన్నాయి. అవధీ భాషలో తులసీదాస విరచిత రామచరిత మానస్ సుప్రసిద్ధం. ఇవే కాకుండా బెంగాలీ, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ తదితర భాషల్లోనూ, ఆంగ్ల భాషలోనూ రామాయణాన్ని పలువురు రచించారు.ఆధునిక కాలంలో కూడా రామాయణ కథను పలువురు మళ్ళీ చెప్పారు. మన దేశంలోనే కాదు పలు విదేశాల్లో కూడా రామకథ పలు కళారూపాలుగా, సాహిత్యంగా బహుళ ప్రాచుర్యం పొందినది. ప్రజల నాల్కలపై నానుతున్నది. వారి జీవన విధానాలపై విశిష్ట ప్రభావం చూపుతున్నది.ఎలా, ఎపుడు, ఎవరు చెప్పినా రామాయణానికి మాతృక వాల్మీకిదే. ఆయన చెప్పినదే రామకథ. ఇది మానవ చరిత్రలోనే ఒక అపురూపం. ఈ కథ పౌరాణికమే కాదు ఇతిహాసం కూడా. ధార్మిక జీవనం ఎలా ఉంటుందనేది రామాయణాన్ని చదివిన వారికి ప్రత్యక్షంగా అవగతం అవుతుంది.

Thursday, 27 June 2013

 దీక్షిత రామాయణం

(8వ భాగం )
 Photo

 బ్రహ్మదేవుని వర ప్రభావంతో రామాయణ కథను దర్శించిన ఆత్మ జ్ఞాని వాల్మీకి మహర్షి ఐదు వందల సర్గలతో. ఇరవై నాలుగు వేల శ్లోకాల సముచ్చయంగా రామాయణ మహా గ్రంథాన్ని జగజ్జన తారకంగా అందించాడు.ఇది బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలనే ఆరు విభాగాలుగా ఆవిష్కృతం అయింది.
గొప్ప గొప్ప వృత్తాలు, రమణీయ ఉపమానాలు, ఉత్కృష్ట పదజాలాలతో కూడిన వేలాది శ్లోకాలను రామకథా నిర్మాణానికి వాల్మీకి మహర్షి సృష్టించాడు. ఇవన్నీ కేవలం సాహిత్య పరంగా ప్రాధాన్యమైనవే కావు. వీటిలో ఎంతో ఆధ్యాత్మిక మహత్తు దాగి ఉంది. అద్భుత శక్తిదాయకాలైన బీజాక్షర సహిత శ్లోకాలు కూడా వీటిలో ఉన్నాయి. మహామహిమాన్వితాలైన వృత్తాంతాలు, ఉప కథలు కూడా ఈ రచనలో చోటు చేసుకున్నాయి.
అందుకే రామాయణం లోని ప్రత్యక్షరం ఒక శక్తి బీజం. ఏది చదివినా, ఏ శ్లోకం విన్నా, ఏ కాండను పారాయణ చేసినా కూడా మనో ఈప్సితాలు నెరవేరతాయి.
శ్రీరామ చంద్రుని సంతానం కుశలవులతో సహా అనేకమందికి వాల్మీకి రామకథను బోధించాడు. ఆ విధంగా పురుషోత్తమ చరితను లోకానికి వినిపిస్తూ ఆ మహర్షి తన జన్మను చరితార్థం చేసుకున్నాడు.
యుగ యుగాలుగా, తర తరాలుగా వాల్మీకి విరచిత రామ కథను లోకులు చదువుతూనే ఉన్నారు.. వింటూనే ఉన్నారు... తరిస్తూనే ఉన్నారు.
వాల్మీకి చెప్పిన రామకథ ఆద్యంతం మహాద్భుతం... అలౌకికానంద దాయకం.. అత్యంత మహిమాన్వితం...!
ఈ రామాయణ మహా గ్రంథం సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మగా భాసిస్తోంది. సద్గ్రంథ లక్షణాలు, కావ్య వైశిష్ట్యం, పుష్కలమై గోచరించడంతో పాటు నవరసాల మేలిమి మేళవింపు ఈ కథా సంవిధానంలో కనిపిస్తుంది. మానవ జాతిని యుగాయుగాలూ సమూలంగా సముద్ధరించే సమున్నత విలువల ఆవిష్కరణ ఇందు ద్యోతకం అవుతుంది.
రామ కథను తన అపూర్వ తపోశక్తి ఫలితంగా.. భగవదనుగ్రహంతో మానవాళికి అందించిన రామకథా సుధాస్రవంతి అక్కడితో ఆగిపోలేదు. ఆ మహనీయుని వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న అనేక మంది మహర్షులు, మహాత్ములు, పుణ్యాత్ములు ఈ కథను చెప్పారు. ఎవరు చెప్పినా.. ఎన్ని సార్లు.. ఎన్ని విధాలుగా చెప్పినా వాసి తరగని అద్భుత గాధ ఇది. అందుకే చెప్పిన కొలదీ... వింటున్న కొలదీ కొత్తగా, మధురంగా, రసభరితంగా, మనోహరంగా, జన తారకంగా, జ్ఞాన దాయకంగా, అద్భుత ఫలభరితమై ఒప్పుతూ ఈ దివ్య గాధ అందరినీ అలరిస్తోంది. ఎందరినో తరింప జేస్తోంది.
 దీక్షిత రామాయణం

(7వ భాగం )
 Photo

ఆ శ్లోకంలో నిండి ఉన్న చందో వైభవం వాల్మీకిని మరింత అబ్బుర పరచింది. ఇది తాను అనుకొని చెప్పిన శ్లోకం కాదని అనుకోకుండా తననుంచి వ్యకమైనదని గ్రహించాడు. అదెలా జరిగినదో తెలియక కలత చెందాడు. తాపసి నైన తాను అరిషడ్వర్గాలకు దూరంగా మెలగ వలసినది పోయి అలవి కాని క్రోధానికి లోనై శపించడం విపరీతంగా తోచింది వాల్మీకికి.పైగా ఆ శాప శ్లోకం సైతం తనకేన్నడూ పరిచయం కూడా లేని చందస్సుతో కూడి ఉండడం చూసి అచ్చెరువొందాడు. ఇది తన ప్రమేయం లేని విషయమని.. ఏదో ఈశ్వర కల్పితమని తుదకు ఆ తపస్వి నిర్ధారణకు వచ్చాడు. కానీ పరితాపం మాత్రం ఆయనను వీడి పోలేదు.
క్రౌంచ పక్షుల మరణం ఒక కారణమైతే... తన శాపం మరో కారణంగా ఆ ఋషి అలా వ్యథ చెందుతూనే ఉన్నాడు.కాలం గడుస్తున్నా వాల్మీకి వేదన తీరడం లేదు.
ఇది చూసిన బ్రహ్మదేవుడు ఆ ఋషి వ్యాకులతను దూరం చేయాలని తలచాడు.అనుకున్నదే తడవుగా ఆ మహర్షి ఎదుట ప్రత్యక్షం అయ్యాడు.
ఈ ఆకస్మిక అనుగ్రహానికి అమితంగా సంతోషించాడు వాల్మీకి. బ్రహ్మదేవుని భక్తితో స్తుతించాడు.
"వాల్మీకీ.. నీవు గొప్ప తపశ్శాలివి. అరిషడ్వర్గాలపై నీవు ఎప్పుడో అదుపు సాధించావు. నీవు ధర్మాధర్మ విచక్షణ, వివేచనా కలిగిన పరిపూర్ణ జ్ఞానివి. నీ మనసులో ఉన్న ఆందోళన, ఆవేదన నాకు తెలుసు. అయితే జరిగిన దానిలో నీ ప్రమేయం లేదు. జరిగినది అంతా లోక కళ్యాణార్థమే.. అది తెలుసుకో.. ఇక శాంతుడవు కా.
మరో ముఖ్య విషయం చెబుతాను విను.. నా అనుగ్రహం వల్లనే సరస్వతి నిన్ను కటాక్షించింది. ఆమె ప్రభావమే నీ నోట అద్భుత శ్లోకమై పలికింది. అంతే తప్ప ఇందులో నీవు శపించావని తలచి పరితపించేందుకు ఏదీ లేదు" అంటూ బ్రహ్మ దేవుడు అనునయించాడు.
సాక్షాత్తు విధాత చెప్పడంతో వాల్మీకి హృదయం కుదుట పడింది. అతడు వేదన నుంచి విముక్తుడవడం చూసిన బ్రహ్మదేవుడు చిరు మందహాసంతో పలికాడు..
నీవు సరస్వతీ అనుగ్రహంతో పలికిన శ్లోకం చూసావు గదా.. అదే చందస్సుతో శ్రీ రామాయణ గ్రంథాన్నిరచించు. అది నారాయణ చరితం. నీవు రచించిన ఆ రామకథ విష్ణు విభూతిగా లోకాలను తరింపజేస్తుంది. సర్వకాల సర్వావస్థలకు తగిన రీతిలో జనులకు సద్గతులను అనుగ్రహిస్తుంది. స్వయం ధర్మ స్వరూపమై భాసిస్తుంది. ఆది కావ్యమై ఆచంద్ర తారార్కం అలరారుతుంది.
సరస్వతీ కటాక్షం చేత ఇందు నీ వాక్యం ఎచ్చటనూ అసత్యం కానేరదు. ఇది సత్యం.
ఇక చింతను వీడి కర్తవ్య బద్ధుడవు కమ్ము. పవిత్రంగా.. రమ్యంగా... అద్భుత శ్లోకబద్ధంగా రామాయణాన్ని రచించు." అంటూ వాల్మీకిని వాత్సల్యంతో ఆశీర్వదించాడు విధాత.
బ్రహ్మ దేవుని ఆదేశం విన్నతోడనే వాల్మీకి బ్రహ్మానందంతో పొంగిపోయాడు.
నారదుడు చెప్పినపుడు రామకథను లీలగా విన్నాడు వాల్మీకి. కానీ ఏదీ గుర్తు లేదాయే..మరెలా?
వాల్మీకి సందేహం అర్థమైనది బ్రహ్మకు.
నారదుడు తొలుత చెప్పిన దానికంటే విశదంగా, విపులంగా... కథలోని ప్రతి పార్శ్వం అర్థం అయ్యేలా..ప్రతి పాత్ర తత్వం పరిపూర్ణంగా అవగతం అయ్యేలా వాల్మీకికి వరాన్ని అనుగ్రహించాడు.
నీవు రచించే ఈ రామకథ భువిని శాశ్వతంగా రంజింప జేస్తుంది. మానవులకు ధర్మార్థ కామ మోక్షాలను సిద్ధింప జేస్తుంది. ధర్మ గ్రంథమై ప్రకాశిస్తుంది.అంతేకాదు నాయనా... ఈ గ్రంథ రాజం భూమిపై నిలిచి ఉన్నంత కాలమూ నీవు నాతొ పాటు సత్యలోకంలో వసిస్తావు... అని ఆశీర్వదించిన బ్రహ్మదేవుడు అంతర్థానం అయ్యాడు.
వాల్మీకి, ఆయన శిష్య బృందం ఇంకా సంభ్రమం నుంచి తేరుకోలేదు...ఆ తదుపరి వాల్మీకి, శిష్య సమూహం పలుమార్లు ఈ శ్లోకాన్నిపఠించారు.
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీ: సమాః
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
ఇలా చదివే కొద్దీ చవులూరుతున్న ఆ శ్లోక మహిమను గాంచి వారు అత్యంత ఆశ్చర్యానికి లోనయ్యారు.
లక్షలు, కోట్ల సంవత్సరాల పాటు ఈ దివ్యకథ జనుల నాల్కలపై సజీవంగా అలరారగలదని, ఎన్నెన్నో యుగాలను తరింపజేయగలదని వారికి ఆనాడే తోచింది.
(రమణీయం,కమనీయం,పరమ పావన రామాయణం..ఇంకా వుంది .రేపటి వరకూ చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి )

Wednesday, 26 June 2013

 దీక్షిత రామాయణం

(6వ భాగం )

(ప్రముఖ రచయిత విసురజ సమర్పణలో, ప్రత్యక్ష నిత్య ప్రర్యవేక్షణలో...)

***********


Photo 
రామచంద్రుని సుగుణాలను వర్ణించిన నారదుడు స్థూలంగా రామ కథ కూడా చెప్పాడు. వాల్మీకి మనసు పొరల్లో ఎక్కడో దాగిన జ్ఞాపకాల దొంతరను ఈ కథా శ్రవణం మళ్ళీ కదిలించింది. ఆ మహర్షి శ్రీరాముని సమున్నత వ్యక్తిత్వ వైభవానికి పరవశుడయ్యాడు. తన్ను తాను మరచిపోయాడు. అతడి మనసంతా ఆ రాముని ఆరామమై పోయింది. మనోఫలకం నిండుగా సర్వశుభ లక్షణ సంశోభితుడైన ఆ శ్రీరాముని దివ్యమంగళ విగ్రహాన్ని నింపుకొన్నాడు వాల్మీకి. రాముని గురించిన ఆలోచనలతోనే రోజంతా గడుపుతున్నాడు.ఇదిలా సాగుతుండగా ఒకనాడు జరిగిన మరో సంఘటన వాల్మీకి జీవితాన్ని మరో మలుపు తిప్పింది.
వాల్మీకి ఆశ్రమం తమసా నదీ తీరాన ఉంది. దట్టమైన అరణ్య గర్భంలో పశుపక్ష్యాదులకు నానావిధ మృగాలకు ఆవాసమై అత్యద్భుత ప్రకృతి సౌందర్యంతో అలరారుతోంది ఆ మునివాటిక.
ఒకనాటి అపరాహ్న వేళ స్నాన సంధ్యాది కార్యక్రమాల కోసం వాల్మీకి శిష్య సమేతంగా తమసా తీరానికి బయలుదేరాడు. మార్గ మద్యాన ఒక చెట్టుపై కనిపించిన సహజ సుందర దృశ్యం ఆ మహర్షిని అమితంగా ఆకట్టుకుంది. ఆ చెట్టు శాఖపై పరస్పరాపేక్షతో, ఆనందంగా క్రీడిస్తున్న క్రౌంచ పక్షుల జంట వాల్మీకిని ఆకర్షించింది.
ఈ దృశ్యం చూడగానే ఎందుకో అతడి మనసు ఆహ్లాదభరితం అయింది. ఇదీ అని చెప్పలేని అనిర్వచనీయ అనుభూతితో మహర్షి ఆ పక్షుల ప్రేమానుబంధాలను కాంచి పరవశించిన వేళ.. ఊహించని ఒక విషాదం జరిగిపోయింది.
ఎక్కడినుంచో ఆకస్మికంగా దూసుకొచ్చిన ఒక బాణం ఆ పక్షుల జంటలోని మగపిట్టను తాకింది. మరుక్షణం అది విలవిల లాడుతూ కొమ్మ మీదనుంచి నేలరాలింది.
నేలపై పడిన ఆ పిట్ట బాణం దెబ్బకు గిలగిలా కొట్టుకొని మరణించింది. అది చూసి దాని జంట పక్షికి గుండె పగిలింది. ప్రియుని ఎడబాటు తాళలేక వియోగ పరితాపంతో వగచి విలపించింది.. ఆ పై వేదనా భారంతో తను కూడా కన్నుమూసింది.
ఈ విషాద దృశ్యంతో వాల్మీకి మనసు వికలమైంది. కరుణార్ద్రతలకు నెలవైన ఆ ముని హృదయం ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా క్రోధంతో భగ్గుమంది.
బాధ, ఆవేదన, కోపం ముప్పిరిగొని వివశుడైన వాల్మీకి ..
"పాపాత్ముడా! ఎంత పని చేశావురా. ఆనందంగా కలిసి జీవిస్తున్న క్రౌంచ పక్షుల్ని నిష్కారణంగా చంపావు. నేవు బతుకంతా నిలువ నీడ లేకుండా తిరుగుతావులే.." అంటూ శపించాడు.
విచిత్రంగా వాల్మీకి మనసులోని విషాదం, క్రోధం వాక్య రూపంలో కాకుండా.. ఒక శ్లోక రూపంలో వ్యక్తం అయ్యాయి.
వాల్మీకి ఈ చిత్రానికి ఆశ్చర్య పోయాడు. అసంకల్పితంగా ఇలా ఎలా జరిగిందో అర్థం కాక విస్మయానికి గురయ్యాడు

************

(రమణీయం,కమనీయం,పరమ పావన రామాయణం..ఇంకా వుంది .రేపటి వరకూ చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి )
 దీక్షిత రామాయణం

(5వ భాగం )

************
కలలోనో.. లేక ఇలలోనో తాను ఆనాడు విన్నది మహామహితాత్ముడైన ఒక దివ్యపురుషుని గురించిన విషయం అనే స్పృహ వాల్మీకిలో స్పష్టంగా ఉంది. ఆ సత్పురుషుని సమాచారం తెలియాలంటే.. ఇదీ అని విస్పష్టంగా చెప్పజాలని ఆయన విశిష్టతను తెలుసుకోవాలంటే..అంత సులువేమీ కాదు. ఒక ఉత్కృష్టమైన వస్తువును తాను తెలుసుకోగోరుతున్నాను అనే జ్ఞానంతో వాల్మీకి నారదుడ్ని ఇలా ప్రశ్నించాడు,

"దేవర్షీ.. మీరు త్రికాల వేదులు, సర్వలోక సంచారులు, సదా హరినామ స్మరణతో వాక్శుద్ధి పొందిన సత్యవాక్పరాయణులు.. మీకు తెలియని విశేషం గానీ, మీరు తెలియజాలని విషయం గానీ ముల్లోకాలలో ఎక్కడా ఉంటాయని నేను భావించడం లేదు. అందుకే నేను మిమ్మల్ని ఒక విషయం అడగదలచాను.. ఇది చాలా కాలంగా నా మదిలో ఉన్న ఒక ఆర్తికి ఆధారమని భావించండి.. నేనేది అన్వేషిస్తున్నానో అది నాకు అందజేయండి.." అని కోరాడు సవినయంగా.

నారదుడు ఎంతో సంతోషించాడు వాల్మీకి పలుకులకు.

మహర్షీ! విద్వత్తు మురిసేలా మాట్లాడావు. నీ ఆకాంక్ష సముచితమైనది..నీవేది అడిగినా నా తల్లి సరస్వతి అనుగ్రహంతో అది నీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. నిస్సంకోచంగా అడుగు. " అన్నాడు నారదుడు.

స్వామీ.. లోకంలో ఇదుగో ఈతడు మహాపురుషుడు.. ఇతడే సర్వోన్నతుడు, నరోత్తముడు.. అని ఎవర్ని సంబోధించాలి? అటువంటి విశిష్ట వ్యక్తిత్వం ఎవరికి ఉంది? మహా వీరుడై ఉండీ ఆశ్రిత రక్షకుడు ఎవడు? శక్తికి ప్రతిరూపమై కూడా శాంతి కాముకుడైన వాడేవడు? మాతాపితరుల ఎడల అమిత భక్తి పరుడు ఎవడు? సోదర బంధుమిత్ర జన సపరివారాదులపై వాత్సల్యం చూపు సద్గుణ సంపన్నుడు ఎవడు? యుద్ధం వస్తే ప్రపంచాన్నయినా నిలువరించగల ధీరుడు ఎవడు. భూదేవిని మించు సహనశీలి ఎవడు? తనను ఆశ్రయించిన వారిపై ఎనలేని దయజూపు మహారాజు ఎవడు? మర్యాదా పురుషోత్తముడు, మాట ఇస్తే అటు సూర్యుడు ఇటు పొడిచినా వెనుకాడని సత్యసంధుడు.. ధర్మపరుడు, నిగర్వి, వాగ్భూషణుడు..శాస్త్రవిహిత కర్తవ్యాన్ని ఎన్నడూ విస్మరించని కర్మయోగి.. అంతెందుకు అన్నివిధాలా ఈ జగతిలో అత్యున్నతుడు ఎవడు? అట్టి పరిపూర్ణ మానవుని గురించి నాకు దయతో తెలియజెప్పి నన్ను చరితార్థుడ్ని చేయండి" అని వేడుకున్నాడు వాల్మీకి.

మహర్షి ప్రార్థన వినగానే నారదుడికి పరమానందమైపోయింది. ఈ ప్రశ్న వాల్మీకి నోట పలకడానికి వెనుక గల ఆధ్యాత్మిక పరమార్థం నారదునికి అర్థమైపోయింది.ఇప్పటి వరకూ తనకు మాత్రమె తెలిసిన శ్రీరామ కథ అనే దివ్య సుధ ఇక జగతి జనులను ఆచంద్ర తారార్కం తరింప జేసేందుకు ఒక సద్గ్రంథమై భువిని అవతరించే శుభ తరుణం ఆసన్నమైనదని తెలిసి మహాదానందభరితుడయ్యాడు.
పట్టలేని ఆ మహదానందంతో.. ఒడలు పులకరిస్తుండగా, గొంతు కంపిస్తుండగా.. ఇలా చెప్పుకొచ్చాడు దేవర్షి...
"వాల్మీకి మునిపుంగవా! సూర్య వంశమున ఉద్భవించిన కారణ జన్ముడు శ్రీరామ చంద్రమూర్తి. సకల శుభ లక్షణ సంజాతుడు, సర్వ సద్గుణ విరాజితుడు అయిన దివ్యపురుషుడు రాముడు.
నీవు అడిగిన అన్ని శుభ గుణాలు ఆయనలో ద్విగుణీకృతమై భాసిస్తాయి. ఉత్క్రుష్టతకు, విశిష్టతకు, ఉన్నతికి ఆయన నెలవు.. మానవత్వానికి, పరాక్రమానికి సాటిలేని కొలువు. అయోధ్యా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఈ రాజు రూపురేఖా విలాసాలలో చంద్రుని మించిన అందగాడు. సహనము, పరోపకార చింతనలో భూమిని అధిగమించిన వాడు.. పరాక్రమమున ఇతడికి సాటి ముల్లోకాలలోనూ లేడు, ధర్మ నిర్ణయంలోనూ,స్వధర్మ పాలనలోనూ సర్వలోకాలకూ ఆదర్శప్రాయుడు.. శరణాగత రక్షణలో పక్షపాతం ఎంచని ఏలిక, ప్రజలను బిడ్డలుగా చూచువాడు.. గురువులను పసివాని వలె సేవించు వాడు.. ఏకపత్నీ వ్రతుడు, ఒక్క బాణమే సర్వ శత్రు హరణమని పేరొందిన వాడు, సోదరులకు పెన్నిధి.. భూమండలం సమస్తానికీ సార్వభౌముడు కాగల ఒకేఒక సత్పురుషుడు.. అందరికీ ఆత్మబంధువు.. ప్రణవ స్వరూపుడు.. అతడే శ్రీరామ చంద్రుడు... అంటూ వివరించాడు నారదుడు.
 దీక్షిత రామాయణం

(4వ భాగం )

************


Photo 
దివ్యమైన రామ కథా శ్రవణంతో ఆ ప్రాంతమంతా హరితార్ణవమైంది. రామ కథను చెబుతున్న నారదుని నేత్రాలు ఆనంద పరవశంతో చెమర్చాయి. నారదుడి హృదయం పరిపూర్ణమైన ఆనందంతో నిండిపోయింది.అక్కడే పుట్టల మధ్య తపస్సులో మునిగి ఉన్నఅతడు కూడా ఈ కథను లీలగా విన్నాడు. ఈశ్వరమంత్ర ధ్యానంతో మొదలైన అతడి వ్యక్తిత్వ సంస్కరణ పర్వానికి ఈ రామ కథా శ్రవణంతో పరిపూర్ణత చేకూరింది..
ఏదో ఒక దివ్యానందభరితమైన అనుభవసారాన్ని అందిపుచ్చుకున్న అనుభూతి కలిగింది అతడికి.. మహోధృతమైన తపస్సుకు తోడు మహాద్భుతమైన రామచరిత అతడ్ని మహర్షిని చేసింది.. కానీ అతడికి తపోదీక్షలో ఉన్నపుడు విన్న విషయాలు పూర్తి స్థాయిలో జ్ఞాపకం లేవు. కానీ ఏదో ఒక పరమ రహస్యాన్ని తను విన్న అనుభూతి మాత్రం మనసంతా ఆవరించింది. తనువంతా నిండి పోయింది. ఇందుకు ఒక కారణం లేకపోలేదు.. విధాత ఆనాడు సత్యలోకంలో నారదునికి రామకథ చెప్పినప్పుడే ఇది దేవ రహస్యమని నొక్కి వక్కాణించాడు. అన్యులకు ఈ రహస్యాన్ని చెప్పరాదని ఆదేశించాడు.
కానీ లోక బాంధవుడైన నారదుడు ఆ మాట మరచి అరణ్య మధ్యాన కథా గానం చేసాడు.
ఇదంతా చూస్తూనే ఉన్నాడు పైనుంచి బ్రహ్మ దేవుడు. ఆయన మోముపై చిరునగవు పూచింది.
జరగబోయే చమత్కారం తన సృష్టి వైచిత్రిని మించిన విచిత్రమని తలచి ఆయన బహు సంతసించాడు ఆ క్షణంలో..
ఇక పుట్టలోని తపస్వి విషయానికి వస్తే.. ఏ క్షణంలో అయితే దివ్య కథాగానాన్ని విన్నాడో.. ఆ క్షణం నుంచే స్థిమితం లోపించింది. ఇక తపస్సు చాలనుకున్నాడు. అమితానందమూర్తిగా ఆ పుట్టల నుంచి బయటికి వచ్చాడు. పుట్ట (వాల్మీకం) నుంచి బయటకు వచ్చిన ఆ మహాత్ముడు అటుపై వాల్మీకి అని పిలువబడ్డాడు.
ఈ వాల్మీకి అక్కడే ఆశ్రమ జీవనం ప్రారంభించాడు. శిష్యులకు ఉత్తమ ధర్మాలను బోధిస్తూ, మంచి చెడుల విశ్లేషణలో, ధర్మాధర్మ విచక్షణలో జ్ఞానిగా మన్ననలను అందుకుంటూ వాల్మీకి వెలుగొందుతున్నాడు.
అన్నీ బాగానే ఉన్నా వాల్మీకి హృదయంలో మాత్రం ఏదో చింత మెదులుతూనే ఉంది. ఎవరో ఒక సచ్చిదానంద సత్పురుషుని గురించి ఏదో ఒక సుషుప్తావస్థలో విన్నట్టుగా ఒక చిన్న జ్ఞాపకం ఆయనను వీడడంలేదు. అయితే అది ఏ జన్మలో.. ఎక్కడ.. ఎవరి ద్వారా.. ఎవరి గురించి అనే సంగతి మాత్రం ఆ మహర్షికి స్ఫురణకు రావడం లేదు. భౌతిక విధులు నిర్వర్తిస్తూనే ఆ చిదాత్మ స్వరూపుని గురించి అంతర్లీనంగా సదా చింతన గావిస్తున్నాడు వాల్మీకి.
ఇలా ఉండగా ఒక నాడు ఒక సంఘటన జరిగింది. నారద మహర్షి ఏదో కార్యార్థమై వెళుతూ మార్గమధ్యాన వాల్మీకి ఆశ్రమం చెంత ఆగాడు.
తన ఆశ్రమానికి వచ్చిన ఆ దేవర్షిని వాల్మీకి అర్ఘ్య పాద్యాదులతో భక్తితో అర్చించాడు. అతిథి పూజ అనంతరం సద్గోష్టి మొదలైంది.
ఎంతో కాలంగా తనను వేధిస్తున్న ప్రశ్నకు, తన చింతకు త్రికాలవేది, త్రిభువన సంచారి అయిన నారదుడే సరైన పరిష్కారం చూపగలడని వాల్మీకికి తోచింది. వెంటనే జాగు చేయక తన మనసులోని సందేహాన్ని సముచిత రీతిలో ఆ మహనీయుడి ముందు ఉంచాలని తలచాడు వాల్మీకి.
(రమణీయం,కమనీయం,పరమ పావన రామాయణం..ఇంకా వుంది .రేపటి వరకూ చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి )
 దీక్షిత రామాయణం

(3వ భాగం)

************

Photo: దీక్షిత రామాయణం  ... దీక్షిత విరచిత రామాయణం ఆ శ్రీరామునికే అర్పణం అదే శ్రీరామార్పణం.

(17-06-2013)

                                           శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం

(ప్రముఖ రచయిత విసురజ సమర్పణలో, ప్రత్యక్ష నిత్య ప్రర్యవేక్షణలో...)

                         (3వ భాగం)

                            ************

 

అదెలాగంటే.. కన్నీటితో తనను ఉద్ధరించాలని కోరిన ఆ పతితుడ్నిమంచివాడిగా మార్చాలని నిశ్చయించారు. తమ అద్వితీయ తపోశక్తిని వారు ఈశ్వర నామంతో రంగరించారు. ఆ దివ్య పెన్నిధిని అతడికి రహస్య మంత్రంగా ఉపదేశించారు. ఆ మంత్రాన్ని మననం చేసుకోగానే అతడి మనస్సు శాంతమైనది. అంతరంగం పరిశుద్ధమైనది.

ఋషుల మాట మేరకు అతడు ఆ మంత్రాన్ని జపిస్తూ అలా.. ధ్యానంలోకి జారిపోయాడు.భావి సమాజాన్ని ఉద్ధరించగల ఒక మహాయోగిని తీర్చిదిద్దిన సంతృప్తితో ఆ సప్తర్షులు నిర్వికారులై, నిష్కాములై సాగిపోయారు..అదే మునుల గొప్పతనం. తమకంటూ ఏ కోరికలూ లేకుండా, లోక కళ్యాణమే ధ్యేయంగా వారు తపస్సు చేస్తారు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించిన పుణ్యాన్ని, శక్తిని ఇలా ఇతరులను తరింపజేసే క్రమంలో నిస్సంకోచంగా ధారవోస్తారు. ఈషన్మాత్రం కూడా లోభత్వం లేని దాతృత్వం వారిది. అందుకే ఋషులకు మనం సదా రుణపడి ఉండాలి. అనుదినం అనుక్షణం వారు నిర్దేశించిన మార్గంలో నడవాలి, ధర్మాల్ని పాటించాలి. అదే ఋషి ఋణం తీర్చుకునే ఏకైక మార్గం.

ఇక ఇక్కడ.. అరణ్యంలో అతడి తపస్సు సాగుతూనే ఉంది. నిర్నిరోధంగా, నిరంతరంగా..ఎన్ని వసంతాలు, వర్షాలు గడిచిపోయాయో లెక్కలేదు. ఈశ్వర నామామృతాన్ని గ్రోలుతూ... ఆ దివ్య వైభవాన్ని ఆస్వాదిస్తూ.. అలౌకిక అద్వితీయ అమరానంద స్థితిలో అతడు అలాగే ఉండిపోయాడు. బాహ్య స్పృహ అతడికి పూర్తిగా నశించింది. కాల క్రమంలో ఆ అరణ్యం పలు మార్పులకు లోనైంది. కానీ అతడు కదలనే లేదు. ఆతడి శరీరం చుట్టూ పుట్టలు మొలిచాయి. తన దేహం పిపీలకాది సూక్ష్మ జీవులకు, క్రిములకు ఆహారంగా మారి కృశించింది. ఇంత జరిగినా అతడి మనసు దైవధ్యాస నుంచి మరలలేదు. అతడి నోటి వెంట హరనామ స్మరణ ఆగలేదు...కాలం నడక ఇలా సాగుతుండగా.. అక్కడ సత్యలోకంలో ఒక విశేషం జరిగింది..

ఒకనాడు నారదుల వారికి విధాత శ్రీమన్నారాయణుని నరావతార గాధను వివరించాడు. అదే శ్రీరామ కథ. ఆ కథను విన్నంతనే నారదుని హృదయం పులకించింది. కన్నుల వెంట అశ్రుధార జాలువారింది. హరి వైభవం సమస్తం కట్టెదుట నిలిచింది. అమృతోపమానమైన ఆ రామకథను నెమరు వేసుకుంటూ నారదుడు దివి నుంచి భువికి దిగి వచ్చాడు. ఇక్కడ సప్తర్షుల ఉపదేశం మేరకు అతడు తపస్సు చేస్తున్న అరణ్య ప్రాంతం మీదుగానే నారదుడి పయనం సాగుతోంది...ఆ పరిసరాలకు చేరువ కాగానే నారదుని హృదయం ఆనందార్ణవమైంది. రామకథా సుధ అతడ్ని వివశుడ్ని చేసింది..ఆ దివ్య గుణ విభూతులను తలచి తలచి మది పరవశించింది. ఎలుగెత్తి ఆ రామకథను గానం చేయాలన్న కోరిక నారదుని ఆవహించింది...కానీ విధాత తనకీ కథ చెప్పే ముందు ఇచ్చిన ఆనతి గుర్తొచ్చింది.. "నారదా ! ఇది దేవ రహస్యం సుమా.... ఎవరికీ ఈ కథను చెప్పవద్దు.." అంటూ బ్రహ్మ చెప్పిన ఆ మాట స్ఫురణకు రావడంతో నారదుడికి నిరుత్సాహం కలిగింది.. ఇంత గొప్ప విష్ణు వైభవాన్ని అందరికీ చాటకుండా ఈ చిన్న మదిలో దాచడమా.. ఎలా? అంటూ పరితపించాడు. అది అసంభవమని భావించాడు. ఇక రామానంద వివశుడైన ఆ నారదుడు రామకథను వినిపించడం ప్రారంభించాడు. దీనికి ముందు అతడు చుట్టూ దీక్షతో పరికించి ఎవరూ లేరని ఖాయపర్చుకున్నాడు. తదుపరి చుట్టూ ఉన్న తరూలతలనే శ్రోతలుగా ఎంచి ఎలుగెత్తి  రామకథా గానం ప్రారంభించాడు.

(రమణీయం,కమనీయం, పరమ పావన రామాయణం.. చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి...ఇంకా వుంది)

*ఈ ధారావాహిక పై మీ స్పందన, మాకు తెలియజేయండి ---మా మెయిల్ ఐడి .............

manrobocreations@gmail.com

అదెలాగంటే.. కన్నీటితో తనను ఉద్ధరించాలని కోరిన ఆ పతితుడ్నిమంచివాడిగా మార్చాలని నిశ్చయించారు. తమ అద్వితీయ తపోశక్తిని వారు ఈశ్వర నామంతో రంగరించారు. ఆ దివ్య పెన్నిధిని అతడికి రహస్య మంత్రంగా ఉపదేశించారు. ఆ మంత్రాన్ని మననం చేసుకోగానే అతడి మనస్సు శాంతమైనది. అంతరంగం పరిశుద్ధమైనది.

ఋషుల మాట మేరకు అతడు ఆ మంత్రాన్ని జపిస్తూ అలా.. ధ్యానంలోకి జారిపోయాడు.భావి సమాజాన్ని ఉద్ధరించగల ఒక మహాయోగిని తీర్చిదిద్దిన సంతృప్తితో ఆ సప్తర్షులు నిర్వికారులై, నిష్కాములై సాగిపోయారు..అదే మునుల గొప్పతనం. తమకంటూ ఏ కోరికలూ లేకుండా, లోక కళ్యాణమే ధ్యేయంగా వారు తపస్సు చేస్తారు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించిన పుణ్యాన్ని, శక్తిని ఇలా ఇతరులను తరింపజేసే క్రమంలో నిస్సంకోచంగా ధారవోస్తారు. ఈషన్మాత్రం కూడా లోభత్వం లేని దాతృత్వం వారిది. అందుకే ఋషులకు మనం సదా రుణపడి ఉండాలి. అనుదినం అనుక్షణం వారు నిర్దేశించిన మార్గంలో నడవాలి, ధర్మాల్ని పాటించాలి. అదే ఋషి ఋణం తీర్చుకునే ఏకైక మార్గం.

ఇక ఇక్కడ.. అరణ్యంలో అతడి తపస్సు సాగుతూనే ఉంది. నిర్నిరోధంగా, నిరంతరంగా..ఎన్ని వసంతాలు, వర్షాలు గడిచిపోయాయో లెక్కలేదు. ఈశ్వర నామామృతాన్ని గ్రోలుతూ... ఆ దివ్య వైభవాన్ని ఆస్వాదిస్తూ.. అలౌకిక అద్వితీయ అమరానంద స్థితిలో అతడు అలాగే ఉండిపోయాడు. బాహ్య స్పృహ అతడికి పూర్తిగా నశించింది. కాల క్రమంలో ఆ అరణ్యం పలు మార్పులకు లోనైంది. కానీ అతడు కదలనే లేదు. ఆతడి శరీరం చుట్టూ పుట్టలు మొలిచాయి. తన దేహం పిపీలకాది సూక్ష్మ జీవులకు, క్రిములకు ఆహారంగా మారి కృశించింది. ఇంత జరిగినా అతడి మనసు దైవధ్యాస నుంచి మరలలేదు. అతడి నోటి వెంట హరనామ స్మరణ ఆగలేదు...కాలం నడక ఇలా సాగుతుండగా.. అక్కడ సత్యలోకంలో ఒక విశేషం జరిగింది..

ఒకనాడు నారదుల వారికి విధాత శ్రీమన్నారాయణుని నరావతార గాధను వివరించాడు. అదే శ్రీరామ కథ. ఆ కథను విన్నంతనే నారదుని హృదయం పులకించింది. కన్నుల వెంట అశ్రుధార జాలువారింది. హరి వైభవం సమస్తం కట్టెదుట నిలిచింది. అమృతోపమానమైన ఆ రామకథను నెమరు వేసుకుంటూ నారదుడు దివి నుంచి భువికి దిగి వచ్చాడు. ఇక్కడ సప్తర్షుల ఉపదేశం మేరకు అతడు తపస్సు చేస్తున్న అరణ్య ప్రాంతం మీదుగానే నారదుడి పయనం సాగుతోంది...ఆ పరిసరాలకు చేరువ కాగానే నారదుని హృదయం ఆనందార్ణవమైంది. రామకథా సుధ అతడ్ని వివశుడ్ని చేసింది..ఆ దివ్య గుణ విభూతులను తలచి తలచి మది పరవశించింది. ఎలుగెత్తి ఆ రామకథను గానం చేయాలన్న కోరిక నారదుని ఆవహించింది...కానీ విధాత తనకీ కథ చెప్పే ముందు ఇచ్చిన ఆనతి గుర్తొచ్చింది.. "నారదా ! ఇది దేవ రహస్యం సుమా.... ఎవరికీ ఈ కథను చెప్పవద్దు.." అంటూ బ్రహ్మ చెప్పిన ఆ మాట స్ఫురణకు రావడంతో నారదుడికి నిరుత్సాహం కలిగింది.. ఇంత గొప్ప విష్ణు వైభవాన్ని అందరికీ చాటకుండా ఈ చిన్న మదిలో దాచడమా.. ఎలా? అంటూ పరితపించాడు. అది అసంభవమని భావించాడు. ఇక రామానంద వివశుడైన ఆ నారదుడు రామకథను వినిపించడం ప్రారంభించాడు. దీనికి ముందు అతడు చుట్టూ దీక్షతో పరికించి ఎవరూ లేరని ఖాయపర్చుకున్నాడు. తదుపరి చుట్టూ ఉన్న తరూలతలనే శ్రోతలుగా ఎంచి ఎలుగెత్తి రామకథా గానం ప్రారంభించాడు.

(రమణీయం,కమనీయం, పరమ పావన రామాయణం.. చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి...ఇంకా వుంది)
 దీక్షిత రామాయణం

( రెండవ భాగం)
.........................................................................................................................
ఒక మహర్షి ఆ చోరుడ్ని ఇలా ప్రశ్నించాడు.
"ఓయీ! ఎందుకు నీవిలా పరులను హింసిస్తున్నావు? ఇది పాపమని నీకు తెలియదా?"
"స్వామీ ఇది నా వృత్తి.. కుటుంబ పోషణ కోసం ఎవరు ఏ వృత్తినైనా చేయవచ్చు పాపం, పుణ్యం అన్నీ మీబోటి వాళ్ళకే తప్ప మాకు కాదు, అన్నాడు కరుకుగా." భార్యా బిడ్డల పోషణ బాధ్యత తనపై ఉంది గనుక అందుకై ఏ పని చేసినా తప్పు కాదనే రీతిలో వాదిస్తున్న ఆ చోరునితో మరో ముని ఇలా పలికాడు. "పాపం చేసిన ఎవడైనా సరే దాని ఫలితం అనుభవించాల్సిందే.."
ఈ మాటతో దొంగకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఒహోయ్ సన్యాసులూ నన్నే బెదిరిస్తున్నారే... ఇదిగో ఈ కత్తి చూశారా? మీ అందరి కుత్తుకలూ కోసినా పదును తగ్గదు...." అంటూ పొడవాటి కత్తిని ఝళిపించాడు.
"బాబూ! నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావు సరే.. కానీ నిన్ను మింగడానికి సిద్ధంగా ఉన్న ఆ రాక్షసిని ఎలా భయపెట్టి తరిమేస్తావ్ మరి? " అంటూ చేతితో ఒకవైపు చూపుతూ ప్రశ్నించారా మునిపుంగవులు.
హహ్హహ్హా ..అంటూ వికటాట్టహాసం చేస్తూ.. "రక్కసా... నన్నా..మింగుతుందా?" అంటూ మునులు చూపిన వైపు తల తిప్పాడా దొంగ. మరుక్షణంలో ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. అక్కడ అతడికి నిజంగానే ఒక మహారాక్షసి కనిపించింది. పర్వత పరిమాణంలో ఉన్న ఆ రాక్షసి నోరు పెద్ద దిగుడు బావిలా కనిపిస్తోంది. పెద్ద కోరలు, నల్లటి ఒళ్ళు, నోటి వెంట రక్తపు ధారలు, ఒళ్లంతా మానవ పుర్రెలతో అలంకరించుకుని మహా భయంకరంగా ఉందా ఆకృతి. భయంతో ఆ చోరునికి నోటి వెంట మాట పెగలడంలేదు... అతి కష్టంమీద మునులను ప్రశ్నించాడిలా..
"సాములూ, ఇది మీ మాయ కాదు గదా?" అని.
మందహాసం చేసారు మహర్షులు. "ఇది మాయా కాదు, మహత్తూ కాదు... నీ పాపాల రాశి ఇది. ఇంతకాలం నువ్వు మహా పాపాలు గావించి మూట కట్టుకున్న సంచిత ప్రారబ్ధం. ఇది నిన్ను కబళించక మానదు." అన్నారు.
అంతకంతకూ ఆకృతి పెరుగుతూ తనను మింగడానికి మీదకు వస్తున్న ఆ రాక్షసిని చూసి పై ప్రాణాలు పైనే పోయిన దొంగకి అంతకాలం తనపై, తన బలసామర్థ్యాలపై ఉన్న విశ్వాసం ఒక్కసారిగా వీగిపోయింది. తను చేసేది పాపమనే యోచన కూడా లేకుండా ఇంతకాలం గడిపిన ఆ చోరునికి దాని విశ్వరూపం ఒక్కసారిగా విస్పష్టంగా కనిపించింది. అతడిలో భయం స్పష్టంగా కనిపిస్తోంది..
ఒక మహర్షి అతడిలో మిగిలిన అంతిమ సంశయాన్ని కూడా తొలగించాలని భావించాడు.
"నువ్వు ఈ రాక్షసి బారినుంచి బయట పడాలంటే ఒక్కటే మార్గం ఉంది".. అన్నాడాయన.
అదేమిటో చెప్పి తనను కాపాడమని ప్రాధేయపూర్వకంగా అడిగాడు చోరుడు.
"నువ్వు నీ వాళ్ళ కోసం ఎన్నో పాపాలు చేశానని అంటున్నావు.. అయితే ఆ పాపంలో వాళ్ళు కూడా కొంత భాగం తీసుకుంటారేమో అడిగి చూడు... అలా ఎవరైనా భాగం తీసుకునేందుకు ముందుకువస్తే... నీకు ఈ రాక్షస పీడ విరగడవుతుంది."
ఓస్ అంతేనా... అంటూ ఒక్క ఉదుటున ఇంటికి పరుగు తీశాడు ఆ దొంగ.
తాను సర్వం కుటుంబం కోసమే చేస్తున్నపుడు వారు తనను నిరాదరించరని పూర్తిగా నమ్మాడతడు.
తన ఘోర పాతకాల తాలూకు పాప ఫలాన్ని, అందువల్ల లభించే నరకాన్ని తనతో పాటు పంచుకునే వారెవరని అందరినీ అడిగాడు.
భార్యాబిడ్డలు ఒకే మాట చెప్పారు. "మమ్మల్ని పోషించడం నీ విధి. అందుకు నీవు అనుసరించే మార్గం నీ ఇష్టం. అందలి పాప పుణ్యాలు కూడా నీవే. అంతే తప్ప వాటి పాప భారాన్ని మేము మోయలేము. మోయం కూడా."
మానవ పరమైన సంబంధ బాంధవ్యాలు అశాశ్వతాలని. వాటి ముసుగులో చేసే కర్మలకు ఎవరికి వారే ఏకాకిగా బాధ్యత వహించాలని తెలియజెప్పడమే ఋషుల చర్యలోని ఆంతర్యం. ఆ సత్యం బోధపడింది అతడికి. స్వర్గ నరకాలు స్పృహకు వచ్చాయి. ఎవరి కోసం హైరానా పడుతున్నాడో, ఎన్ని పాపాలైనా చేస్తున్నాడో.. వాళ్ళే తనను ఇలా ఒంటరిని చేయడంతో.. ఆ మరుక్షణంలో అతడికి మోహం నశించింది.
అతడిలో మోహపాశం తొలగగానే అతడిని తరుముతున్న భూతం కూడా అంతర్ధానం అయిపోయింది.
అతడిలో నిక్షిప్తమై ఉన్న పురాకృత పుణ్య సంస్కారాలు ఆ క్షణంలో ఉద్దీపనం అయ్యాయి..
పశ్చాత్తాపంతో కరిగి నీరైన అతడు వడివడిగా మునుల చెంతకు వెళ్ళాడు.
వారి పాదాలపై పడ్డాడు.. తన తప్పులు మన్నించాలని, తనను ఉద్ధరించాలని వేడుకున్నాడు.. కన్నీళ్ళతో వారి పాదాలు కడిగాడు.
కరుణాంతరంగులైన ఆ మహర్షులు కరిగిపోయారు.
దోచుకోబోయిన దొంగకు ఎదురేగి మరీ తమ వద్దనున్న ఆధ్యాత్మిక సంపదను, ఎనలేని తపోశక్తిని వారు ధారపోసారు. తద్వారా సర్వమానవ జాతికి మహోపకారం గావించారు ఆ సప్తర్షులు.

***********************
(రమణీయం,కమనీయం, పరమ పావన రామాయణం..ఇంకా వుంది. రేపటి వరకూ చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి)
దీక్షిత రామాయణం...దీక్షిత విరచిత రామాయణం ఆ శ్రీరామునికే అర్పణం అదే శ్రీరామార్పణం .
శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం
(ప్రముఖ రచయిత విసురజ సమర్పణలో, ప్రత్యక్ష నిత్య ప్రర్యవేక్షణలో...)
............................................................................................................................


Photo Photo
జగతికి ఆదర్శం...దేశ ప్రగతికి దిశానిర్దేశం, సమాజ హితానికి సౌలభ్య సందేశం, మాటకి, మైత్రికి, తృష్ణకి సముచిత సమాహారమే శ్రీ రామాయాణం. ఈ జగాన రామనామ గానం...సుమధురం మరియు పరమ పవిత్రం...ఏక పత్నీవ్రతానికి, ఆడి తప్పని మాటకు, పితృవాక్య పరిపాలనకు, సమస్త ప్రజల మనోభీష్టసిద్ధి సంరక్షణకు... శ్రీ రామాయణం ప్రామాణికం, జనులకు పరమపద సోపాన సుమార్గం, అజరామర అనురాగానికి అక్షరామృతం.. శ్రీ రామాయణం. అలాంటి శ్రీ రామాయణాన్ని తేట తెనుగులో, సులభ శైలిలో, అలతి అలతి పదాల కూర్పుతో, పండిత-పామరులకు, నేటి వర్తమనానికి, రేపటి భవిష్యత్తుకు, దిక్సూచిగా, ఆదర్శనీయంగా, తమ్ముడు/ఇష్టుడు సవ్యసాచైనా దీక్షితులు సుబ్రహ్మణ్యం అందిస్తున్నాడు.

నేటి ఆధునికంలో, త్వరపడు ప్రజానిక గమనంలో నిత్యం మనం విస్మరింస్తున్న ఎన్నో జీవిత సత్యాలను, ఆవిష్కరిస్తూ, మీ ముందుకు త్వరలో వస్తోంది. ఇలాంటి రచన చేయడానికి విద్వత్తు ఒక్కటే సరిపోదు, పరిశీలన, భక్తిభావం, నిజాయితీ కావాలి. కాల్పనిక విషయాల జోలికి వెళ్ళకుండా, భక్తీ భావంతో రామాయణ ప్రాశస్త్యాన్ని తెలియజేయాలి. ఈ ప్రయత్నంలో తమ్మ్డుడు దీక్షితులు సుబ్రహ్మణ్యం సఫలీకృతుడు అయ్యాడని చెప్పగలను. ఆ శ్రీ రాముడి ...సాకేత సార్వభౌముడి కృపకు పాత్రుడయ్యాడు కనుకనే...ఈ రోజు ఈ మహాద్గ్రంధం మీ ముందు డైలీ ధారావాహికగా వస్తోంది. మనమందరం ఈ శ్రీరాముని కధకు మన పురాణ ఇతిహాసానికి మనస్ఫూర్తిగా స్వాగతిద్దాం, తమ్ముడు దీక్షితుల సుబ్రమణ్యంని నిండుమనసుతో అభినందిద్దాం.

ఈ సమయంలో మరొకర్ని స్మరించుకోవాలి, మరో విషయం చెప్పుకోవాలి. అర్దవిహీన, అర్ధనగ్న, బూతుసాహిత్యాలు పట్టు, పెట్టని కోటలా, గోల గోషాలు రాజ్యమేలుతున్న తరుణాన ఈ శ్రీ రామాయణానికి చేయూతనిచ్చి అన్ని పత్రికలు ఒక్కటి కావు, అందరు చీఫ్ ఎడిటర్ లు ఒక్కలా వుండరు అని ప్రత్యక్షంగా నిరూపించిన మన 'మాన్ రోబో మాగ్ జైన్' మరియు 'ది గ్రేట్' విజయార్కే గురించి ఈ సమయంలో ఎంత చెప్పిన తక్కువే అని మీరందరూ ఒప్పుకుంటారుగా...

ఈ శ్రీ రామాయాణం ఆసాంతం అద్భుతంగా పసిబాలలు సైతం అర్ధం చేసుకునే విధంగా సరళమైన రీతిలో రంజించే విధంగా వుంటుంది. నాకు ఈ మహత్తర అవకాశాన్ని అందించిన తమ్ముడు దీక్షితులు సుబ్రహ్మణ్యంకి అలాగే నాచే ప్రేమగా అన్నయ్య అని పిలుపించుకునే శ్రీ విజయార్కే గారికి అన్నిటికి మించి నాకు అద్భుత విషయాన్ని/శ్రీ రామాయణాన్ని ముందు మాట, సమర్పణ, పర్యవేక్షణ అదృష్టాన్ని కలిగించిన నా దేవదేవుడు..శిర్ది సాయినాధునికి నమోవాక్కములతో....

నా సమర్పణలో, ప్రత్యక్ష నిత్య ప్రర్యవేక్షణలో ఈ శ్రీ రామాయణం ప్రతి ఎపిసోడ్ తగిన బొమ్మలతో మిమ్మల్ని కలుస్తుంది, తప్పక అలరిస్తుంది అని నమ్ముతూ...
మీ
విసురజ (జగన్నాధ్ వెళిదిమళ్ళ)
............................................................................................................................
1)
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీ: సమాః

యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
అంటూ మహర్షి వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా వెలువడిన అద్భుత చందోబద్ధ శ్లోకం రామాయణానికి నాంది పలికింది.
ఈ శ్లోకమందలి చందో వైభవం చాల విశిష్టమైనది.
ఆ చంద్ర తారార్కమూ శ్రీరామ కథను సజీవంగా జనం నోటి వెంట పలికించడమే గాక వారి మనో ఫలకాల పై ఆ దివ్య గాధను సుప్రతిష్టితం చేసిందీ రచనా వైశిష్ట్యం.వాల్మీకిని ఆది కవిగా జగత్ ప్రసిద్ధం చేసిన ఈ శ్లోకం నేపథ్యం కడు విచిత్రం. అసలు వాల్మీకి చరితమే అత్యంత అబ్బురం. ఆయన ఈ జగతికి అందించిన రామకథా సారమే ఒక మహాద్భుతం...మహిమాన్వితం...!

పూర్వాశ్రమంలో వాల్మీకి మహర్షి కాదు కదా కనీసం సజ్జనుడు కూడా కాదు. అడవి దారుల వెంట సాగే పుణ్యాత్ములను దారి కాచి దోచుకుని ఆ పాపపు సొమ్ముతో బతికే దుష్టుడు. గుణముచేత మహా క్రూరుడైన ఈ చోరుడు పురాకృత పుణ్య పాప సంచిత కర్మలు రెంటినీ ఘన రాశిగా కలిగిన వాడు. ఆ పాప వశాన అలా ఎన్నో ఏండ్లు అడవి దారులలో దొంగ గా నిస్సారమైన జీవనంగడిపాడు. వక్రమార్గాన సంపాదిస్తూ కుటుంబ పోషణ గావించే వాడు.అయితే పురాకృత పుణ్య వశాన ఒకనాడు అతడికి సప్తర్షులు తారసపడ్డారు.అది ఒక గొప్ప ఉదయం.... ధార్మిక జగతికి మహోదయం.

ఆనాడు శుద్ధులై హరిస్మరణ మగ్నమైన విశుద్దాంతరంగులై ఒక కీకారణ్యం మీదుగా పయనిస్తున్నారు సప్తర్షులు.వారి దివ్య తపోశక్తి ప్రభావం అనన్యమైనది.. వారు సాగుతున్న బాట మొత్తం దివ్య కాంతులీను తున్నది. క్రూర జంతువులు, సహజ జాతివైరులు కూడా దుష్ట స్వభావం మరచి శాంతులైసంచరిస్తున్నాయి. ఓం నమో నారాయణాయ.. ఓం నమఃశివాయ.. మంత్ర ధ్వనులు మంద్రమై ఆపరిసరాలలో వ్యాపిస్తూ అలౌకిక అవ్యక్త ఆనందాన్ని నింపుతున్నాయి.సమస్తమూ ఇంతటి అద్భుతానికి లోనవుతున్న వేళ ఏ ప్రభావమూ పడని శుద్ధ లౌకికుడు ఆ చోరుడు ఒక్కడే...భువి సమస్తానికి అమృత ధార అనదగ్గ రామకథా దివ్య ఔషధాన్ని పంచే ఒక దివ్య ప్రణాళికకు ఆ క్షణం తెర లేచింది.
సప్తర్షులు చోరునికి ఎదురయ్యారు...పశు ప్రవృత్తి కలిగిన మనిషికి సంస్కారం ఏముంటుంది? ఎదుటి వారి గొప్పదనంతో నిమిత్తం మాత్రం ఏముంది గనుక.. ? సప్తర్షుల వద్ద ఉన్న సంపదను దోచుకోవాలని సంకల్పించాడు ఆ చోరుడు..వారిని అటకాయించాడు. కత్తి చూపి బెదిరించాడు. తన పూర్వ నేరాలు, ఘోరాలను చెప్పి వారిని భయపెట్టే ప్రయత్నం గావించాడు.కమండలంతో సహా ఉన్నదంతా అక్కడ పెట్టి వెళ్ళమని హుంకరించాడు.అడవిలో నివసిస్తూ ఇంద్రియాలను నిగ్రహించి తపస్సు చేసుకునే తమ వద్ద భౌతిక సంపదలు ఉండవని వారెంత చెప్పినా వినలేదు. అయితే మహర్షులు మహిమాన్వితులు.. లోకోద్ధరణ మాత్రమే వారికి తెలిసిన విద్య.. ఆ చోరునిలో వారికి క్రౌర్యం మాత్రమే కనిపించలేదు. ఏ మూలనో అతడి పూర్వ సంస్కారాలు గోచరించాయి. అతడు సాధారణ వ్యక్తి కాదని.. చిన్న సంఘర్షణ కల్పించి సంస్కరిస్తే గొప్ప సంస్కర్తకాగలడని, మహర్షిగా మానవజాతికి మహోపకారం చేస్తాడని వారు గ్రహించారు.
(సశేషం, రేపు మరికొంత)