జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైరెండవ అంకం
.............................
సాయిబాబా... యోగాభ్యాసము
....................................
సాయిబాబాకు యోగాభ్యాస విద్యలన్నీ తెలుసు. ఈషణ్మార్గములందును సాయిబాబా ఆరితేరినవారు. అందులోనివే.. ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి. అందులో 1) ధౌతి యనగా 03 అంగుళాల వెడల్పు, 22 1/2 అడుగుల పొడవు గల తడిగుడ్డతో కడుపును లోపలనుంచి శుభ్రపరచుట. అలాగే 2) ఖండయోగమనగా శరీరావయములన్ని విడదీసి తిరిగి కలుపుట.
................................
1. ధౌతి లేక శుభ్రపరచు విధానం..
ద్వారకమాయీ 'మసీదు' కు దూరంగా ఒక మఱ్ఱిచెట్టు దగ్గర దిగుడు బావి కలదు. సాయిబాబా ప్రతి మూడవరోజు అక్కడకు పోయి ముఖప్రక్షాళనం, స్నానం చేస్తుండేవారు. ఒకనాడు సాయిబాబా తన ఊపిరి తిత్తులను బయటకు కక్కి వాటిని బావి నీటితో శుభ్రపరచి నేరేడుచెట్టుపై ఆరవేయుట అక్కడే వున్న కొందరు గమనించిరి. షిర్డీలోని కొందరు దీనిని కండ్లార చూసితిరి. సాధారణంగా ధౌతియనగా 03 అంగుళాల వెడల్పు, 22 1/2 అడుగుల పొడవు గల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు వుండనిచ్చిన పిమ్మట బయటకు తీస్తారు. కాని సాయిబాబా అనుసరించే ధౌతి యోగం చాల విశిష్టము, అసాధారణం. అది వారికే సాధ్యమైనది.
2. ఖండయోగము
సాయిబాబా ఖండయోగ ప్రక్రియలో తన శరీరావయాలన్నీ వేరు చేసి మసీదు నందు వేర్వేరు చోట్ల పెట్టేవారు. ఒకసారి ఒక పెద్దమనిషి మసీదుకు పోయి సాయిబాబా అవయయాలు వేర్వేరు స్థలాలలో పడియుండుట జూచి భయకంపితుడై సాయిబాబాను ఎవరో ఖూనీ చేసేరేమో అనుకుని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేద్దామనుకునే. మరలా ఆలోచించిన పిదప మొట్టమొదట తానే ఫిర్యాదు చేస్తే ఆ విషయం పైన తనకు కొంచమైన తెలుసు అనుకుని తననే అనుమానిస్తారని మానివేసే. మరుసటి రోజు మసీదుకు బోవ సాయిబాబా యెప్పటివలే హాయిగా కూర్చుండుట చూసి ఆశ్చర్యపడే. ముందురోజు తాను చూసినదంతా కలే అనుకున్నాడు. అప్పుడు సాయిబాబా అతనిని పిలచి రాత్రి ఏమిటి బయపడ్డావా అని అడిగినాక కానీ అతనికి సాయిబాబా సర్వాంతర్యామని బోధపడలేదు.
షిర్దిలోని మూడు వాడలు
............................
సాఠె వాడ
పాదుకలు ప్రతిష్టించిన వేపచెట్టును, దానిచుట్టునున్న స్థలాన్నీ హరివినాయకసాఠే కొని సాఠెవాడని పెద్ద వసతిని వచ్చి పోయే భక్తుల అవసరార్ధమై కట్టించే. అప్పట్లో షిర్డీ పోయిన భక్తులకిదే నివాస స్థలము. వేపచెట్టు చుట్టు అరుగు ఎత్తుగా కట్టి మెట్లు పెట్టిరి. మెట్ల క్రింద ఒక గూడు వంటిది గలదు. భక్తులు మండపంపై ఉత్తరముఖంగా కూర్చుండేవారు. గురువారం, శుక్రవారం ఎవరైతే అక్కడ ధూపం వేస్తారో సాయిబాబా కృపవల్ల వారు సంతోషముతో వుండేవారని, వుంటారని ప్రతీతి. ఈ సాఠెవాడ చాల పురాతనమైనది కావున తదుపరి మరామత్తు అవసరమైననాడు తగిన మార్పులు, మరామత్తులు షిర్డీ సంస్థానం వారు చేసిరి. సాఠెవాడని ఏర్పడిన కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత్ వాడాయను మరొకటి కట్టిరి.
దీక్షిత్ వాడ
న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు వెళితే అచ్చట రైలు ప్రమాదంలో కాలుకి దెబ్బ తగిలి కాలుకుంటుపడే. అది యెంత ప్రయత్నించినను కాలు కుంటుతనం బాగు కాలేదు. స్నేహితుడైన నానా సాహెబ్ చాందోర్కరు ఈతనిని షిర్డీ సాయిబాబాను దర్శించమని సలహా యిచ్చెను. 1909వ సంవత్సరమున
కాకా సాహెబ్ దీక్షిత్ సాయిబాబా వద్దకు పోయే. అక్కడ పరివర్తనుడై తన కాలు కుంటితనం కన్న తన మనస్సులోని కుంటితనాన్ని తీసివేయుమని సాయిబాబాను ప్రార్థించే. సాయిబాబా దర్శనంతోనే అమితానందభరితుడై షిర్దిలోనే నివసించుటకు నిశ్చయించుకొనే. తనకొరకు, ఇతర భక్తులకు పనికి వచ్చునట్లు ఒక వాడను నిర్మించే. దినం 10-12-1910వ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసే.
ఆనాడు రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగే.
(1) సాయిబాబా సమ్మతి లేక అక్కడే వుంటున్న దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను.
(2) చావడిలో రాత్రిపూట హారతి ప్రారంభమయ్యే.
కాక సాహెబ్ దీక్షిత్ పేరుతొ కట్టిన ఈ దీక్షిత్ వాడ పూర్తి కాగానే, 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశం చేసే.
సమాధి మందిరం
నాగపూరు నివాసైన కోటీశ్వరుడైన బూటీ తరువాత మరో పెద్ద రాతిమేడను నిర్మింపచేసే. చాల ధనం దీనికొరకు వెచ్చించే. సాయిబాబాగారి భౌతికశరీరం దానిలో సమాధి చేయబడే అందుచే బూటీ ఖర్చు పెట్టిన ధనమంతా సద్వినియోగం అయ్యిందని చెప్పవచ్చు. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలంలో ముందర సాయిబాబా స్వహస్తాలతో పెంచిన పూలతోట వుండే. ఆ పూలతోటలో సాయిబాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట, గొప్పులు తవ్వుట మొదలైనవి చేసేవారు.
ఈ విధంగా మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడే. అంతకుముందు షిర్డీ కుగ్రామంలో అక్కడ ఒక్క వసతిగృహం కూడ లేకుండే. .
.......................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
ఇరవైరెండవ అంకం
.............................
సాయిబాబా... యోగాభ్యాసము
....................................
సాయిబాబాకు యోగాభ్యాస విద్యలన్నీ తెలుసు. ఈషణ్మార్గములందును సాయిబాబా ఆరితేరినవారు. అందులోనివే.. ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి. అందులో 1) ధౌతి యనగా 03 అంగుళాల వెడల్పు, 22 1/2 అడుగుల పొడవు గల తడిగుడ్డతో కడుపును లోపలనుంచి శుభ్రపరచుట. అలాగే 2) ఖండయోగమనగా శరీరావయములన్ని విడదీసి తిరిగి కలుపుట.
................................
1. ధౌతి లేక శుభ్రపరచు విధానం..
ద్వారకమాయీ 'మసీదు' కు దూరంగా ఒక మఱ్ఱిచెట్టు దగ్గర దిగుడు బావి కలదు. సాయిబాబా ప్రతి మూడవరోజు అక్కడకు పోయి ముఖప్రక్షాళనం, స్నానం చేస్తుండేవారు. ఒకనాడు సాయిబాబా తన ఊపిరి తిత్తులను బయటకు కక్కి వాటిని బావి నీటితో శుభ్రపరచి నేరేడుచెట్టుపై ఆరవేయుట అక్కడే వున్న కొందరు గమనించిరి. షిర్డీలోని కొందరు దీనిని కండ్లార చూసితిరి. సాధారణంగా ధౌతియనగా 03 అంగుళాల వెడల్పు, 22 1/2 అడుగుల పొడవు గల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు వుండనిచ్చిన పిమ్మట బయటకు తీస్తారు. కాని సాయిబాబా అనుసరించే ధౌతి యోగం చాల విశిష్టము, అసాధారణం. అది వారికే సాధ్యమైనది.
2. ఖండయోగము
సాయిబాబా ఖండయోగ ప్రక్రియలో తన శరీరావయాలన్నీ వేరు చేసి మసీదు నందు వేర్వేరు చోట్ల పెట్టేవారు. ఒకసారి ఒక పెద్దమనిషి మసీదుకు పోయి సాయిబాబా అవయయాలు వేర్వేరు స్థలాలలో పడియుండుట జూచి భయకంపితుడై సాయిబాబాను ఎవరో ఖూనీ చేసేరేమో అనుకుని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేద్దామనుకునే. మరలా ఆలోచించిన పిదప మొట్టమొదట తానే ఫిర్యాదు చేస్తే ఆ విషయం పైన తనకు కొంచమైన తెలుసు అనుకుని తననే అనుమానిస్తారని మానివేసే. మరుసటి రోజు మసీదుకు బోవ సాయిబాబా యెప్పటివలే హాయిగా కూర్చుండుట చూసి ఆశ్చర్యపడే. ముందురోజు తాను చూసినదంతా కలే అనుకున్నాడు. అప్పుడు సాయిబాబా అతనిని పిలచి రాత్రి ఏమిటి బయపడ్డావా అని అడిగినాక కానీ అతనికి సాయిబాబా సర్వాంతర్యామని బోధపడలేదు.
షిర్దిలోని మూడు వాడలు
............................
సాఠె వాడ
పాదుకలు ప్రతిష్టించిన వేపచెట్టును, దానిచుట్టునున్న స్థలాన్నీ హరివినాయకసాఠే కొని సాఠెవాడని పెద్ద వసతిని వచ్చి పోయే భక్తుల అవసరార్ధమై కట్టించే. అప్పట్లో షిర్డీ పోయిన భక్తులకిదే నివాస స్థలము. వేపచెట్టు చుట్టు అరుగు ఎత్తుగా కట్టి మెట్లు పెట్టిరి. మెట్ల క్రింద ఒక గూడు వంటిది గలదు. భక్తులు మండపంపై ఉత్తరముఖంగా కూర్చుండేవారు. గురువారం, శుక్రవారం ఎవరైతే అక్కడ ధూపం వేస్తారో సాయిబాబా కృపవల్ల వారు సంతోషముతో వుండేవారని, వుంటారని ప్రతీతి. ఈ సాఠెవాడ చాల పురాతనమైనది కావున తదుపరి మరామత్తు అవసరమైననాడు తగిన మార్పులు, మరామత్తులు షిర్డీ సంస్థానం వారు చేసిరి. సాఠెవాడని ఏర్పడిన కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత్ వాడాయను మరొకటి కట్టిరి.
దీక్షిత్ వాడ
న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు వెళితే అచ్చట రైలు ప్రమాదంలో కాలుకి దెబ్బ తగిలి కాలుకుంటుపడే. అది యెంత ప్రయత్నించినను కాలు కుంటుతనం బాగు కాలేదు. స్నేహితుడైన నానా సాహెబ్ చాందోర్కరు ఈతనిని షిర్డీ సాయిబాబాను దర్శించమని సలహా యిచ్చెను. 1909వ సంవత్సరమున
కాకా సాహెబ్ దీక్షిత్ సాయిబాబా వద్దకు పోయే. అక్కడ పరివర్తనుడై తన కాలు కుంటితనం కన్న తన మనస్సులోని కుంటితనాన్ని తీసివేయుమని సాయిబాబాను ప్రార్థించే. సాయిబాబా దర్శనంతోనే అమితానందభరితుడై షిర్దిలోనే నివసించుటకు నిశ్చయించుకొనే. తనకొరకు, ఇతర భక్తులకు పనికి వచ్చునట్లు ఒక వాడను నిర్మించే. దినం 10-12-1910వ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసే.
ఆనాడు రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగే.
(1) సాయిబాబా సమ్మతి లేక అక్కడే వుంటున్న దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను.
(2) చావడిలో రాత్రిపూట హారతి ప్రారంభమయ్యే.
కాక సాహెబ్ దీక్షిత్ పేరుతొ కట్టిన ఈ దీక్షిత్ వాడ పూర్తి కాగానే, 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశం చేసే.
సమాధి మందిరం
నాగపూరు నివాసైన కోటీశ్వరుడైన బూటీ తరువాత మరో పెద్ద రాతిమేడను నిర్మింపచేసే. చాల ధనం దీనికొరకు వెచ్చించే. సాయిబాబాగారి భౌతికశరీరం దానిలో సమాధి చేయబడే అందుచే బూటీ ఖర్చు పెట్టిన ధనమంతా సద్వినియోగం అయ్యిందని చెప్పవచ్చు. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలంలో ముందర సాయిబాబా స్వహస్తాలతో పెంచిన పూలతోట వుండే. ఆ పూలతోటలో సాయిబాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట, గొప్పులు తవ్వుట మొదలైనవి చేసేవారు.
ఈ విధంగా మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడే. అంతకుముందు షిర్డీ కుగ్రామంలో అక్కడ ఒక్క వసతిగృహం కూడ లేకుండే. .
.......................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
No comments:
Post a Comment