జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవయిదవ అంకం
.........................
ధైవానికి వివిధ లక్షణాలున్నా ముఖ్యంగా వుండతగినవి (1) కీర్తి, (2) ధనం (3) అభిమాన రహితం (4) జ్ఞానం (5) మహిమ (6) ఔదార్యం.
పైలక్షణాలన్నీ సాయిబాబాలో వుండివుండే.. తన భక్తుల కొరకు ధైవమే సాయిబాబాగా శరీరరూపంగా అవతారమెత్త్తే.
సాయిబాబా దయాదాక్షిణ్యములు, భక్తులను తనవద్దకు రప్పించే వైఖరి వింతైనవి. సాయిబాబా ఒకనాడు యిట్లనే "బానిసలలో బానిసనగు నేను మీకు ఋణపడివున్నాను. మీ దర్శనంచే నేను తృప్తి చెందితి. మీ పాదాలను దర్శించుట నా భాగ్యము. మీ అశుద్దంలో నేనొక పురుగును. అట్లగుటవలన నేను ధన్యుడను."
ఏమి వారి అణకువ! దీనిని ప్రచురించి సాయిబాబాను కించపరిచితినని ఎవరైన అంటే వారిని క్షమాపణ కోరుచుంటి. అందుకు పరిహారముగా సాయిబాబా నామ జపం చేసేద.
సాయిబాబా మాటలు క్లుప్తముగా, భావగర్భితముగా, శక్తివంతంగా సమతూకంతోను నుండే. సాయిబాబా ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా వుండే. సాయిబాబా యిట్లనే "నేను ఫకీరయినప్పటికి, ఇల్లుగాని, భార్యగాని లేనప్పటికి, ఏ చీకు చింతలు లేనప్పటికి, ఒకేచోట నివసించుటచే తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది. ఈ మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచునప్పుడు, నావంటి ఫకీరు సంగతి ఎంతా? ఎవరయితే భగవంతుని ఆశ్రయించుదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి బారినుండి తప్పించుకొందురు. సాయిబాబా తన భక్తుల మేలుకొరకు యిట్లనే "ఎవరు అదృష్టవంతులో, యెవరి పాపాలు క్షీణించునో, వారు నా పూజ చేస్తారు. ఎల్లప్పుడు సాయి సాయని జపించినచో వారిని సప్తసముద్రాలు దాటిస్తా. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలుపొందగలవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారాలు గాని, అష్టాంగయోగాలు గాని నాకు అవసరం లేదు.
భక్తి యున్నచోటనే నా నివాసము." సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి.
జ్ఞానములో సుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించువారు అందరిని సమానంగా ప్రేమించువారు. అటువంటివారు అభిమాన రహితులు, శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు వీరికి అందరు సమానమే. భక్తుల కొరకు తమ పుణ్యాన్ని వ్యయపరచి వారికి సహాయము చేయుటకు సిద్ధముగా వుంటారు. వారు ఇష్టపడనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు సాయిబాబాను స్మరించ లేరు అలాగే వారి లీలలు కూడ ఎరిగి యుండరు. అట్టివారికి సాయిబాబాను చూడాలి, తెలవాలి అనుకున్నా సమయం రాక జరగదు. చాలామందికి సాయిబాబాను మహాసమాధి లోపల చూసే అవకాశము కలుగలేదు. సాయిబాబాను దర్శించవలెనన్న కోరిక వున్నా కొంతమందికి ఆ కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో సాయిబాబా లీలలను వినినచో దర్శనం వల్ల కలుగే సంతుష్టి పొందురు. కొందరు అదృష్టవశాన వారి దర్శనం చేసుకున్నా, సాయిబాబా సన్నిధిలో ఉండవలెనన్న కోరికున్న అచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరును తమ యిష్టానుసారం షిర్డీ పోలేకుండిరి. సాయిబాబా అజ్ఞ మేరకే షిర్డీలో వారు వుండగలిగిరి. సాయిబాబా చెప్పిన వెంటనే షిర్డీ విడువవలసిందే. కాబట్టి సర్వము సాయిబాబా ఇష్టముపై ఆధారపడివుండే.
షిర్డీలో విచిత్రపురుషుడు...నానావల్లి. అతడు సాయిబాబా విషయాలను, పనులను చక్కపెట్టుచుండే. ఒకనాడతడు సాయిబాబా వద్దకు పోయి, గద్దెపై నుంచి సాయిబాబాను దిగమని కోరే. వెంటనే సాయిబాబా లేచి గద్దెను ఖాళీచేసే. నానావల్లి దానిపై కొంతసేపు కూర్చుండి, లేచి, సాయిబాబాను తిరిగి కూర్చొనుమనే. సాయిబాబా తన గద్దెపై తిరిగి కూర్చొనే. నానావల్లి సాయిబాబా పాదాలకు సాష్టాంగనమస్కారం చేసి మరలిపోయే. తనను గద్దె మీద నుంచి దిగి పొమ్మన్నా దానిపై నింకొకరు కూర్చున్నా, సాయిబాబా ఏమి అసంతృప్తి వెలిబుచ్చలేదు. నానావల్లి యెంత పుణ్యాత్ముడో, భక్తుడో కదా... ఆతను సాయిబాబా మహాసమాధి చెందిన పదమూడవనాడు దేహత్యాగం చేసెను.
ఇక్కడ సాయిబాబా అణుకువ, అభిమానరహిత మానసం చూడవచ్చు.
............................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
ఇరవయిదవ అంకం
.........................
ధైవానికి వివిధ లక్షణాలున్నా ముఖ్యంగా వుండతగినవి (1) కీర్తి, (2) ధనం (3) అభిమాన రహితం (4) జ్ఞానం (5) మహిమ (6) ఔదార్యం.
పైలక్షణాలన్నీ సాయిబాబాలో వుండివుండే.. తన భక్తుల కొరకు ధైవమే సాయిబాబాగా శరీరరూపంగా అవతారమెత్త్తే.
సాయిబాబా దయాదాక్షిణ్యములు, భక్తులను తనవద్దకు రప్పించే వైఖరి వింతైనవి. సాయిబాబా ఒకనాడు యిట్లనే "బానిసలలో బానిసనగు నేను మీకు ఋణపడివున్నాను. మీ దర్శనంచే నేను తృప్తి చెందితి. మీ పాదాలను దర్శించుట నా భాగ్యము. మీ అశుద్దంలో నేనొక పురుగును. అట్లగుటవలన నేను ధన్యుడను."
ఏమి వారి అణకువ! దీనిని ప్రచురించి సాయిబాబాను కించపరిచితినని ఎవరైన అంటే వారిని క్షమాపణ కోరుచుంటి. అందుకు పరిహారముగా సాయిబాబా నామ జపం చేసేద.
సాయిబాబా మాటలు క్లుప్తముగా, భావగర్భితముగా, శక్తివంతంగా సమతూకంతోను నుండే. సాయిబాబా ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా వుండే. సాయిబాబా యిట్లనే "నేను ఫకీరయినప్పటికి, ఇల్లుగాని, భార్యగాని లేనప్పటికి, ఏ చీకు చింతలు లేనప్పటికి, ఒకేచోట నివసించుటచే తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది. ఈ మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచునప్పుడు, నావంటి ఫకీరు సంగతి ఎంతా? ఎవరయితే భగవంతుని ఆశ్రయించుదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి బారినుండి తప్పించుకొందురు. సాయిబాబా తన భక్తుల మేలుకొరకు యిట్లనే "ఎవరు అదృష్టవంతులో, యెవరి పాపాలు క్షీణించునో, వారు నా పూజ చేస్తారు. ఎల్లప్పుడు సాయి సాయని జపించినచో వారిని సప్తసముద్రాలు దాటిస్తా. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలుపొందగలవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారాలు గాని, అష్టాంగయోగాలు గాని నాకు అవసరం లేదు.
భక్తి యున్నచోటనే నా నివాసము." సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి.
జ్ఞానములో సుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించువారు అందరిని సమానంగా ప్రేమించువారు. అటువంటివారు అభిమాన రహితులు, శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు వీరికి అందరు సమానమే. భక్తుల కొరకు తమ పుణ్యాన్ని వ్యయపరచి వారికి సహాయము చేయుటకు సిద్ధముగా వుంటారు. వారు ఇష్టపడనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు సాయిబాబాను స్మరించ లేరు అలాగే వారి లీలలు కూడ ఎరిగి యుండరు. అట్టివారికి సాయిబాబాను చూడాలి, తెలవాలి అనుకున్నా సమయం రాక జరగదు. చాలామందికి సాయిబాబాను మహాసమాధి లోపల చూసే అవకాశము కలుగలేదు. సాయిబాబాను దర్శించవలెనన్న కోరిక వున్నా కొంతమందికి ఆ కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో సాయిబాబా లీలలను వినినచో దర్శనం వల్ల కలుగే సంతుష్టి పొందురు. కొందరు అదృష్టవశాన వారి దర్శనం చేసుకున్నా, సాయిబాబా సన్నిధిలో ఉండవలెనన్న కోరికున్న అచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరును తమ యిష్టానుసారం షిర్డీ పోలేకుండిరి. సాయిబాబా అజ్ఞ మేరకే షిర్డీలో వారు వుండగలిగిరి. సాయిబాబా చెప్పిన వెంటనే షిర్డీ విడువవలసిందే. కాబట్టి సర్వము సాయిబాబా ఇష్టముపై ఆధారపడివుండే.
షిర్డీలో విచిత్రపురుషుడు...నానావల్లి. అతడు సాయిబాబా విషయాలను, పనులను చక్కపెట్టుచుండే. ఒకనాడతడు సాయిబాబా వద్దకు పోయి, గద్దెపై నుంచి సాయిబాబాను దిగమని కోరే. వెంటనే సాయిబాబా లేచి గద్దెను ఖాళీచేసే. నానావల్లి దానిపై కొంతసేపు కూర్చుండి, లేచి, సాయిబాబాను తిరిగి కూర్చొనుమనే. సాయిబాబా తన గద్దెపై తిరిగి కూర్చొనే. నానావల్లి సాయిబాబా పాదాలకు సాష్టాంగనమస్కారం చేసి మరలిపోయే. తనను గద్దె మీద నుంచి దిగి పొమ్మన్నా దానిపై నింకొకరు కూర్చున్నా, సాయిబాబా ఏమి అసంతృప్తి వెలిబుచ్చలేదు. నానావల్లి యెంత పుణ్యాత్ముడో, భక్తుడో కదా... ఆతను సాయిబాబా మహాసమాధి చెందిన పదమూడవనాడు దేహత్యాగం చేసెను.
ఇక్కడ సాయిబాబా అణుకువ, అభిమానరహిత మానసం చూడవచ్చు.
............................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
No comments:
Post a Comment