జై షిర్డీ సాయినాధ
తొమ్మిదవ అంకం..
బాబా ఆహార్య, ఆచార వ్యవహారాలు.
............................................
షిర్డీ వచ్చిన మొదట్లో సాయిబాబా తెల్ల తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించే. మరి ఆ గ్రామములో కుస్తీలాడటం ఒక రివాజుగా వుండే. ఆ గ్రామంలో మొహియుద్దీన్ తంబోలి అనే వస్తాదు తరచుగా కుస్తీలు పట్టుచుండే. ఒక విషయములో భేదాభిప్రాయం వచ్చి సాయిబాబా అతనితో కుస్తీపట్టి వోడిపోయే. నాటినుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు తీరును మార్చుకొనే. మొలకు లంగోటి బిగించుకొని, పొడవు చొక్కాను తొడిగి నెత్తిపైనొక గుడ్డ కట్టుకొనేవారు. ఎల్లప్పుడూ ఒక గోనె ముక్కపై కూర్చునే. గుడ్డలు పాతవైనా, మాసిన, చిరిగినా అస్సలు దిగులు చెందక సంతుష్టిగా వుండేవారు. రాజ్య భోగాలు కంటే దారిద్ర్యమే మేలని పలికే. దరిద్రుని స్నేహితుడు భగవంతుడని నిత్యం తెలిపే. మరో యోగైన గంగాఘీరుకు కూడ కుస్తీలపై ప్రేమ. అతనికి కూడా కుస్తీ పట్టుచుండగానే ఒకనాడు వైరాగ్యము కలిగే. అప్పుడే శరీరాన్ని మాడ్చి దేవుని సహవాసం చేయమని ఆకాశవాణి పలికే. అప్పటినుండే గంగాఘీరు సంసారమును విడిచే. ఆత్మసాక్షాత్కారంకై పాటుపడే. పుణతాంబే దగ్గర నది ఒడ్డునొక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండే.
సాయిబాబా జనాలతో కలసి మెలసి తిరుగేవారు కారు. అడిగితేనే జవాబిచ్చే. రోజంతా వేపచెట్టు నీడలో, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డునున్న తుమ్మ చెట్టు నీడనా కూర్చునుచుండే. సాయంకాలంనందు పచార్లు పోయే లేదా పక్క ఊరైన నీమగాం పోవుచుండే. త్రయంబక్ జీ డేంగ్లే యింటికి తరచుగా పోయేవారు. డేంగ్లేపై సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అలాగే అతని తమ్ముడైన నానాసాహెబ్ పట్ల కూడా.. నానాసాహెబ్ ద్వీతీయ వివాహం చేసుకున్న సంతానం కలుగలే. నానాసాహెబ్ ను బాబాసాహెబు డేంగ్లే బిడ్డ కలగాలని కోరామని, అర్ధించమని ఫకీర్ సాయిబాబా వద్దకు పంపే. దయతలచే సాయిబాబా, వారి కరుణతో పుత్ర సంతానం కలిగే. ఆ విషయం బయటకు పొక్కిన పిదప బాబాను దర్శనానికై ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండే. వారి ఘన కీర్తి సర్వత్ర వెల్లడయ్యే. దూరంగా వున్న అహమద్ నగరు వరకు వ్యాపించే. అక్కడనుంచి నానాసాహెబు చందోర్కర్, కేశవ చిదంబర్ మొదలగు చాల మంది షిరిడీకి రాసాగిరి. దినమంతా బాబాను భక్తులు చుట్టిముట్టెడివారు. సాయిబాబా రాత్రులందు పాడుపడిన పాతమసీదులో శయనించే. నాడు సాయిబాబా సామానులు చాలా తక్కువ. అవి చిలుము, పొగాకు, తాంబ గ్లాసు, పొడుగుచొక్కా, తలపైనిగుడ్డ, ఎల్లప్పుడు దగ్గరుండే సటకా మాత్రమే. తలపై గుడ్డను జడవలే చుట్టి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడదీసేవారు. ఆ బట్టలను వారాలా పాటు ఉతుకకుండే. చెప్పులను తొడిగే వారు కారు. దినమంతా గోనేగుడ్డపైనే కూర్చొనే. కౌపీనము ధరించి చలిని వారించుటకన్నట్లు ధుని కెదురుగా ఎడమచేయి కట్టడంపై వేసి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారంను, కోరికలను, ఆలోచనలను ఆహుతి అల్లాయే యజమాని అని అనునిత్యం పలికే. మసీదులో రెండుగదుల స్థలము మాత్రముండే. భక్తులు అక్కడకు పోయి సాయిబాబాను దర్శించుచుండే. 1912 సంవత్సరం తరువాత దానిలో మార్పు కలిగే. పాతమసీదును మరామతు చేసి ఆ నేలపైన నగిషీ రాళ్ళు తాపనచేసిరి. సాయిబాబా ఆ మసీదుకు రాకపూర్వం 'తకియా' (రచ్చ)లో చాలాకాలం నివసించే. అప్పుడప్పుడు బాబా కాళ్ళకు చిన్న చిన్న మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు, భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు.
........................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
తొమ్మిదవ అంకం..
బాబా ఆహార్య, ఆచార వ్యవహారాలు.
............................................
షిర్డీ వచ్చిన మొదట్లో సాయిబాబా తెల్ల తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించే. మరి ఆ గ్రామములో కుస్తీలాడటం ఒక రివాజుగా వుండే. ఆ గ్రామంలో మొహియుద్దీన్ తంబోలి అనే వస్తాదు తరచుగా కుస్తీలు పట్టుచుండే. ఒక విషయములో భేదాభిప్రాయం వచ్చి సాయిబాబా అతనితో కుస్తీపట్టి వోడిపోయే. నాటినుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు తీరును మార్చుకొనే. మొలకు లంగోటి బిగించుకొని, పొడవు చొక్కాను తొడిగి నెత్తిపైనొక గుడ్డ కట్టుకొనేవారు. ఎల్లప్పుడూ ఒక గోనె ముక్కపై కూర్చునే. గుడ్డలు పాతవైనా, మాసిన, చిరిగినా అస్సలు దిగులు చెందక సంతుష్టిగా వుండేవారు. రాజ్య భోగాలు కంటే దారిద్ర్యమే మేలని పలికే. దరిద్రుని స్నేహితుడు భగవంతుడని నిత్యం తెలిపే. మరో యోగైన గంగాఘీరుకు కూడ కుస్తీలపై ప్రేమ. అతనికి కూడా కుస్తీ పట్టుచుండగానే ఒకనాడు వైరాగ్యము కలిగే. అప్పుడే శరీరాన్ని మాడ్చి దేవుని సహవాసం చేయమని ఆకాశవాణి పలికే. అప్పటినుండే గంగాఘీరు సంసారమును విడిచే. ఆత్మసాక్షాత్కారంకై పాటుపడే. పుణతాంబే దగ్గర నది ఒడ్డునొక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండే.
సాయిబాబా జనాలతో కలసి మెలసి తిరుగేవారు కారు. అడిగితేనే జవాబిచ్చే. రోజంతా వేపచెట్టు నీడలో, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డునున్న తుమ్మ చెట్టు నీడనా కూర్చునుచుండే. సాయంకాలంనందు పచార్లు పోయే లేదా పక్క ఊరైన నీమగాం పోవుచుండే. త్రయంబక్ జీ డేంగ్లే యింటికి తరచుగా పోయేవారు. డేంగ్లేపై సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అలాగే అతని తమ్ముడైన నానాసాహెబ్ పట్ల కూడా.. నానాసాహెబ్ ద్వీతీయ వివాహం చేసుకున్న సంతానం కలుగలే. నానాసాహెబ్ ను బాబాసాహెబు డేంగ్లే బిడ్డ కలగాలని కోరామని, అర్ధించమని ఫకీర్ సాయిబాబా వద్దకు పంపే. దయతలచే సాయిబాబా, వారి కరుణతో పుత్ర సంతానం కలిగే. ఆ విషయం బయటకు పొక్కిన పిదప బాబాను దర్శనానికై ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండే. వారి ఘన కీర్తి సర్వత్ర వెల్లడయ్యే. దూరంగా వున్న అహమద్ నగరు వరకు వ్యాపించే. అక్కడనుంచి నానాసాహెబు చందోర్కర్, కేశవ చిదంబర్ మొదలగు చాల మంది షిరిడీకి రాసాగిరి. దినమంతా బాబాను భక్తులు చుట్టిముట్టెడివారు. సాయిబాబా రాత్రులందు పాడుపడిన పాతమసీదులో శయనించే. నాడు సాయిబాబా సామానులు చాలా తక్కువ. అవి చిలుము, పొగాకు, తాంబ గ్లాసు, పొడుగుచొక్కా, తలపైనిగుడ్డ, ఎల్లప్పుడు దగ్గరుండే సటకా మాత్రమే. తలపై గుడ్డను జడవలే చుట్టి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడదీసేవారు. ఆ బట్టలను వారాలా పాటు ఉతుకకుండే. చెప్పులను తొడిగే వారు కారు. దినమంతా గోనేగుడ్డపైనే కూర్చొనే. కౌపీనము ధరించి చలిని వారించుటకన్నట్లు ధుని కెదురుగా ఎడమచేయి కట్టడంపై వేసి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారంను, కోరికలను, ఆలోచనలను ఆహుతి అల్లాయే యజమాని అని అనునిత్యం పలికే. మసీదులో రెండుగదుల స్థలము మాత్రముండే. భక్తులు అక్కడకు పోయి సాయిబాబాను దర్శించుచుండే. 1912 సంవత్సరం తరువాత దానిలో మార్పు కలిగే. పాతమసీదును మరామతు చేసి ఆ నేలపైన నగిషీ రాళ్ళు తాపనచేసిరి. సాయిబాబా ఆ మసీదుకు రాకపూర్వం 'తకియా' (రచ్చ)లో చాలాకాలం నివసించే. అప్పుడప్పుడు బాబా కాళ్ళకు చిన్న చిన్న మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు, భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు.
........................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
No comments:
Post a Comment