జై షిర్డీ సాయినాధ by విసురజ
పెన్నెండు మరియు పదమూడవ అంకాలు..
భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింప వచ్చును. (1)నిర్గుణస్వరూపము, (2) సగుణస్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు. సగుణస్వరూపమునకు ఆకారము గలదు. రెండు స్వరూపములును పరబ్రహ్మవే. మొదటిదానిని కొందురు పూజింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. శ్రీ కృష్ణ పరమాత్మ "భగవద్గీత" 12వ అధ్యాయములో తెలిపినట్లు సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కావున దానినే అనుసరింపవచ్చునని చెప్పిరి. మానవుడు ఆకారముతో వున్నందున భగవంతుని గూడ సగుణ ఆకారముతో నున్నట్లుగానే భావించి, పూజించుట సులభము; సహజము.
మన భక్తి ప్రేమలు కొన్నాళ్ళవరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినగాని వృద్ధిచెందవు. పోను పోను ఆ భక్తి అధికమై నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము - ఈ ఏడు నిత్యం పూజింపదగినవి. సద్గురవు వీని యన్నిటికంటె వున్నతుడు. ఈ సందర్భములో సాయినాథుని మనమున ధ్యానించి వారి నిర్మోహమున కవతారము; పరమభక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కులపై భక్తియే ఆసనము. మనఃకోరికలన్నియు నిరసించుటయే సంకల్పము (పూజ ప్రారంభించి పూర్తిచేసెదమను మనో నిశ్చయము). కొందరు సాయిబాబా భగవద్భక్తుడనెదరు. కొందరు మహాభాగవతుడందురు. అందరికి బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసినవారిని క్షమించువారు. ఎన్నడు కోపించువారు కారు. సూటిగను, నెమ్మదిగను, ఓర్పుకలిగి, సంతుష్టిగానుండువారు. శ్రీ సాయిబాబా ఆకారముతోనున్నప్పటికి నిరాకార స్వరూపులు. వారెల్లప్పుడు ఉద్రేకము, అభిమానము లేకుండ నిత్యముక్తులుగా ఉండువారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగజేయుచు చెట్లకు చేమలకు జీవకళ నిచ్చుచు అనేకుల దాహమును తీర్చుచున్నది అట్లనే సాయివంటి యోగులు తమ జీవనము తాము గడపుచు తక్కినవారందరికి సుఖమును ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీతయందు శ్రీ కృష్ణుడు యోగి తన యాత్మయనియు, జీవత్ప్రతిమయనియు, తానే వారనియు, వారే తాననియు చెప్పినాడు. వర్ణింపనలవికాని యా సచ్చిదానంద స్వరూపమే షిర్డీలో సాయిరూపముగా అవతరించెను. శ్రుతులు బ్రహ్మమును ఆనందస్వరూపముగా వర్ణించుచున్నవి (తైత్తరీయ ఉపనిషత్తు). ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ పరబ్రహ్మస్వరూపమును షిర్డీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా యెవరిని యాశ్రయించి యుండలేదు. వారి అసనము కొరకు గోనెసంచి నుపయోగించిరి. భక్తులు దానిపై చిన్నపరుపు వేసి వీపు ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల యభిప్రాయము నెరవేర్చును. వారి యిష్టానుసారము తనను పూజించుట కెట్టి యభ్యంతరము జూపకుండెను. కొందరు చామరముల తోను, విసనకఱ్ఱలతోను విసరుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిర్డీలో నివసించునట్లు కన్పించినప్పటికి వారు సర్వాంతర్యామి; ఎక్కడ జూచినను వారే యుండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామి తత్వము ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురువుకు సాష్టాంగనమస్కా చెప్పుకుంటూ ఈ క్రింద విషయాన్నీ చూద్దాం.
బాబాకు పంచభూతములు స్వాధీనమైనవని తెలిపే రెండు విషయాలు.. వివరణ
(1) ఒకనాడు సాయంకాలం షిర్డీలో గొప్ప తుఫాను సంభవించెను. దట్టమైన నల్లని మేఘముల ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలయంతయు నీటిలో మునిగెను. జీవకోటులన్నియు పక్షులు, జంతువులు, మనుష్యులు, మిక్కిలి భయపడిరి. తలదాచుకొనుట కందరు మసీదులో ప్రవేశించిరి. షిరిడీలో అనేకస్థానిక దేవత లున్నను వారిని ఆదుకొనలేదు. కావున వారందరు తుఫానును ఆపి వేయుడిని బాబాను వేడుకొనిరి. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి, బిగ్గరగా నిట్లు గర్జించిరి. "ఆగు, యాగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు." కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరు సంతుష్టి చెంది వారి వారి గృహములకు బోయిరి.
(2) ఇంకొకప్పుడు మిట్టమధ్యాహ్నము ధునిలోని మంట యపరిమితముగా లేచెను; మసీదు వెన్ను పట్టీలవరకు పోవునట్లు గనిపించెను. మసీదులో కూర్చొన్నవారి కేమి చేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్ళు పోయుమని గాని మంటలు చల్లార్చుటకు మరేమైన సలహా నిచ్చుటకుగాని వారు భయపడుచుండిరి. ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను. తమ సటకాను (పొట్టి కఱ్ఱ) దీసి దగ్గరనున్న స్తంభముపై కొట్టుచు 'దిగు, దిగు, శాంతించుము' అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు, మంటలు తగ్గి దిగిపోవుచు కొన్ని నిమిషములలో ధుని చల్లబడి మామూలుగా నుండుదానివలె శాంతించెను. ఇట్టివారు భగవదవతారమైన శ్రీ సాయినాథుడు, వారి పాదములపైబడి సాష్టాంగనమస్కారము చేసి సర్వస్యశరణాగతి వేడినవారినెల్ల రక్షించును. ఎవరయితే భక్తి ప్రేమలతో నీ యధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టము లన్నిటినుండి విముక్తులగుదురు. అంతేకాక సాయియందే యభిరుచి, భక్తి, కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నియు నెరవేరును. తుదకు కోరికలను విడచినవారై, మోక్షాన్ని సంపాదించెదరు.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
పెన్నెండు మరియు పదమూడవ అంకాలు..
భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింప వచ్చును. (1)నిర్గుణస్వరూపము, (2) సగుణస్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు. సగుణస్వరూపమునకు ఆకారము గలదు. రెండు స్వరూపములును పరబ్రహ్మవే. మొదటిదానిని కొందురు పూజింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. శ్రీ కృష్ణ పరమాత్మ "భగవద్గీత" 12వ అధ్యాయములో తెలిపినట్లు సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కావున దానినే అనుసరింపవచ్చునని చెప్పిరి. మానవుడు ఆకారముతో వున్నందున భగవంతుని గూడ సగుణ ఆకారముతో నున్నట్లుగానే భావించి, పూజించుట సులభము; సహజము.
మన భక్తి ప్రేమలు కొన్నాళ్ళవరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినగాని వృద్ధిచెందవు. పోను పోను ఆ భక్తి అధికమై నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము - ఈ ఏడు నిత్యం పూజింపదగినవి. సద్గురవు వీని యన్నిటికంటె వున్నతుడు. ఈ సందర్భములో సాయినాథుని మనమున ధ్యానించి వారి నిర్మోహమున కవతారము; పరమభక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కులపై భక్తియే ఆసనము. మనఃకోరికలన్నియు నిరసించుటయే సంకల్పము (పూజ ప్రారంభించి పూర్తిచేసెదమను మనో నిశ్చయము). కొందరు సాయిబాబా భగవద్భక్తుడనెదరు. కొందరు మహాభాగవతుడందురు. అందరికి బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసినవారిని క్షమించువారు. ఎన్నడు కోపించువారు కారు. సూటిగను, నెమ్మదిగను, ఓర్పుకలిగి, సంతుష్టిగానుండువారు. శ్రీ సాయిబాబా ఆకారముతోనున్నప్పటికి నిరాకార స్వరూపులు. వారెల్లప్పుడు ఉద్రేకము, అభిమానము లేకుండ నిత్యముక్తులుగా ఉండువారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగజేయుచు చెట్లకు చేమలకు జీవకళ నిచ్చుచు అనేకుల దాహమును తీర్చుచున్నది అట్లనే సాయివంటి యోగులు తమ జీవనము తాము గడపుచు తక్కినవారందరికి సుఖమును ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీతయందు శ్రీ కృష్ణుడు యోగి తన యాత్మయనియు, జీవత్ప్రతిమయనియు, తానే వారనియు, వారే తాననియు చెప్పినాడు. వర్ణింపనలవికాని యా సచ్చిదానంద స్వరూపమే షిర్డీలో సాయిరూపముగా అవతరించెను. శ్రుతులు బ్రహ్మమును ఆనందస్వరూపముగా వర్ణించుచున్నవి (తైత్తరీయ ఉపనిషత్తు). ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ పరబ్రహ్మస్వరూపమును షిర్డీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా యెవరిని యాశ్రయించి యుండలేదు. వారి అసనము కొరకు గోనెసంచి నుపయోగించిరి. భక్తులు దానిపై చిన్నపరుపు వేసి వీపు ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల యభిప్రాయము నెరవేర్చును. వారి యిష్టానుసారము తనను పూజించుట కెట్టి యభ్యంతరము జూపకుండెను. కొందరు చామరముల తోను, విసనకఱ్ఱలతోను విసరుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిర్డీలో నివసించునట్లు కన్పించినప్పటికి వారు సర్వాంతర్యామి; ఎక్కడ జూచినను వారే యుండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామి తత్వము ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురువుకు సాష్టాంగనమస్కా చెప్పుకుంటూ ఈ క్రింద విషయాన్నీ చూద్దాం.
బాబాకు పంచభూతములు స్వాధీనమైనవని తెలిపే రెండు విషయాలు.. వివరణ
(1) ఒకనాడు సాయంకాలం షిర్డీలో గొప్ప తుఫాను సంభవించెను. దట్టమైన నల్లని మేఘముల ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలయంతయు నీటిలో మునిగెను. జీవకోటులన్నియు పక్షులు, జంతువులు, మనుష్యులు, మిక్కిలి భయపడిరి. తలదాచుకొనుట కందరు మసీదులో ప్రవేశించిరి. షిరిడీలో అనేకస్థానిక దేవత లున్నను వారిని ఆదుకొనలేదు. కావున వారందరు తుఫానును ఆపి వేయుడిని బాబాను వేడుకొనిరి. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి, బిగ్గరగా నిట్లు గర్జించిరి. "ఆగు, యాగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు." కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరు సంతుష్టి చెంది వారి వారి గృహములకు బోయిరి.
(2) ఇంకొకప్పుడు మిట్టమధ్యాహ్నము ధునిలోని మంట యపరిమితముగా లేచెను; మసీదు వెన్ను పట్టీలవరకు పోవునట్లు గనిపించెను. మసీదులో కూర్చొన్నవారి కేమి చేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్ళు పోయుమని గాని మంటలు చల్లార్చుటకు మరేమైన సలహా నిచ్చుటకుగాని వారు భయపడుచుండిరి. ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను. తమ సటకాను (పొట్టి కఱ్ఱ) దీసి దగ్గరనున్న స్తంభముపై కొట్టుచు 'దిగు, దిగు, శాంతించుము' అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు, మంటలు తగ్గి దిగిపోవుచు కొన్ని నిమిషములలో ధుని చల్లబడి మామూలుగా నుండుదానివలె శాంతించెను. ఇట్టివారు భగవదవతారమైన శ్రీ సాయినాథుడు, వారి పాదములపైబడి సాష్టాంగనమస్కారము చేసి సర్వస్యశరణాగతి వేడినవారినెల్ల రక్షించును. ఎవరయితే భక్తి ప్రేమలతో నీ యధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టము లన్నిటినుండి విముక్తులగుదురు. అంతేకాక సాయియందే యభిరుచి, భక్తి, కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నియు నెరవేరును. తుదకు కోరికలను విడచినవారై, మోక్షాన్ని సంపాదించెదరు.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
No comments:
Post a Comment