జై షిర్డీ సాయినాధ by విసురజ
పద్నాలుగు మరియు పదిహేనవ అంకాలు..
షిర్డీ సాయి విచిత్ర చర్యలు.. అపూర్వ లీలలు
.......
1910వ సంవత్సర దీపావళి పండుగరోజు సాయిబాబా ధునివద్ద కూర్చుండి చలి కాచుకోనుచుండే. సాయిబాబా బాగా మండుటకై ధునిలో కట్టెలు వేయుచుండే. ధునిలో మంట బాగుగా మండుచుండే. అకస్మాత్తుగా, అంతలో సాయిబాబా ధునిలో కట్టెలను వేయుట మాని తనచేతిని పెట్టే. వేడిమికి వెంటనే చేయి కాలిపోయే. అది చూచిన, మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండే వెంటనే పరుగెత్తి సాయిబాబాను గట్టిగా పట్టి వెనుకకు లాగిరి. పిదపా సాయిబాబని "దేవా! ఇట్లేల చేసితిరి" అని అడిగిరి. సాయిబాబా యిట్లు జవాబిచ్చే "దూరదేశాన ఒక కమ్మరి భార్య, కొలిమి తిత్తులను ఊదుచుండ తన భర్త పిలివ తన వొడిలో బిడ్డ వున్నాడన్నా సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగిడబోవ వొడిలో వున్న బిడ్డ మండుచున్న కొలిమిలో పడే. అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ అభం శుభం తెలియని పసిబిడ్డను రక్షించితిని, నా చేయి కాలుట అంత బాధాకరం కాదు, కాని ఆ పసివాడు రక్షింపబడెనన్న విషయం నాకు అమితానందం కలుగచేసే" నని సాయిబాబా తెలిపే. సాయిబాబా వారి కారుణ్యతత్వం, వారి భక్తపరయాణతత్వం యిదొక మచ్చుతునక.
1910 సంవత్సరంలో ఒకనాటి ఉదయాన షిర్డీ మసీదులో నున్న శ్రీసాయిబాబా పళ్ళు తోముకుని మొహం కడుక్కుని బాబా గోధుమలు విసురుటకు సంసిద్ధుడయ్యే. నేలపై గోనె పరచి, దానిపై తిరుగలి యుంచి చేటలో కొన్ని గోధుమలు పోసుకుని కఫనీ (చొక్కా) చేతులు పైకి మడచి, పిడికెడు చొప్పున గోధుమలు తిరగలిలో వేయుచు విసరసాగిరి. అది చూచిన హేమాద్ పంత్ “ఈ గోధుమపిండిని బాబా యేమి చేయును? ఆయన గోధుమలు ఎందుకు విసరుచుండే? అయినా భిక్షాటనంచే జీవించువారే! వారికి గోధుమపిండితో పనేమి? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే!” అనుకొనే. మసీదుకు వచ్చినా బాబాను ప్రశ్నించుటకు ధైర్యంగ అడుగుటకు ఎవరు సాహసింపలేదు. విషయం తెలిసి గ్రామంలోని ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై అక్కడకు చేరిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి సాయిబాబాను ప్రక్కకు జరిపి, వారే విసరుట ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేత పట్టుకొని, సాయిబాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి. ఆ చర్యలకు బాబాకు కోపము వచ్చినా వారి ప్రేమకు భక్తికి చాల సంతోషించి చిరునవ్వు చిందించిరి. తిరగలి విసురుతు స్త్రీలు లోలోన యిట్లనుకొనిరి. “బాబాకు ఇల్లు పిల్లలు లేరు. ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడినవారు, వారు పోషించవలసిన వారెవరును లేరు. భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. ఈ పరిస్థితులలో సాయిబాబాకు గోధుమపిండితో పనేమి? సాయిబాబా మిగుల దయమయుడవుటచే మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు” అనుకోని ఆడిన పిండిని నలుగురు స్త్రీలు నాలుగు భాగాలు చేసి తలో భాగం తీసికొనుచుండిరి. అంతవరకు శాంతముగున్న సాయిబాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లనే..
“ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టిందా? ఎవరబ్బ సొమ్మనుకొని పిండిని లూటీ చేయుచుంటిరి? ఏ కారణముచేత పిండిని తీసుకుపోవ చూచుచున్నారు? అయితే సరే, నే చెప్పినట్లు చేయుడు. ఆడిన పిండిని తీసికొనివెళ్లి గ్రామపు సరిహద్దులపైన చల్లండి”
యిదంతా వినిన వనితలు ఆశ్చర్యం కలిగి తమ ఆలోచనలకు సిగ్గుపడి, గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి సాయిబాబా అజ్ఞానుసారము ఆ పిండిని నాలుగు వైపులా చల్లిరి.
హేమాద్ పంత్ ఇదంతా చూసి షిర్డీ ప్రజలను సాయిబాబా చర్యను గూర్చి ప్రశ్నించ వారందరు ఊరిలో కలరా జాడ్యము గలదని దానిని శాంతింపచేయుటకై ఇదొక బాబా తీరు, సాధనమని చెప్పిరి. అక్కడ సాయిబాబా విసరినవి గోధుమలు కావని, వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలారనియు చెప్పిరి. అప్పటి నుండి షిర్డీ గ్రామంలో కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరు ఆనందించిరి. ఇదంతయు వినిన చూసిన హేమాద్ పంత్ కు మిక్కిలి సంతసము కలిగే. ఆ చర్యలోని గూడార్ధమును తెలియ కుతూహలం కలిగే. గోధుమపిండికి కలరా జాడ్యమునకు అసలు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యాకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొకదానినెట్లు శాంతింపజేయు? ఇదంతయు అగోచరముగా తోచే.
తిరగలి విసురుట – దాని వేదాంత తత్త్వము
తిరుగలి విసరుటను గూర్చి షిర్డీ ప్రజలు అనుకొన్న రీతియే కాక చూడ దానిలో వేదాంత భావం కూడ కలదు. సాయిబాబా షిర్డీ యందు సుమారు 60 ఏండ్లు నివసించే. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండురి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపాలు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ; పైరాయి భక్తి; చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని, ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపాలను, కోరికలను తుడిచి వేయవలయును. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవచ్చు. అహంకారమును చంపుకొనవలయును.
ఇక్కడ భక్త కభీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యొకతి తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగే . నిపతి నిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగా కభీరు ఇట్లు జవాబిచ్చే “నేను కూడ ఆ ధాన్యమువలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా?” దానికి నిపతినిరంజనుడిట్లు బదులు చెప్పెను:
“భయములేదు! తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు.”
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
పద్నాలుగు మరియు పదిహేనవ అంకాలు..
షిర్డీ సాయి విచిత్ర చర్యలు.. అపూర్వ లీలలు
.......
1910వ సంవత్సర దీపావళి పండుగరోజు సాయిబాబా ధునివద్ద కూర్చుండి చలి కాచుకోనుచుండే. సాయిబాబా బాగా మండుటకై ధునిలో కట్టెలు వేయుచుండే. ధునిలో మంట బాగుగా మండుచుండే. అకస్మాత్తుగా, అంతలో సాయిబాబా ధునిలో కట్టెలను వేయుట మాని తనచేతిని పెట్టే. వేడిమికి వెంటనే చేయి కాలిపోయే. అది చూచిన, మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండే వెంటనే పరుగెత్తి సాయిబాబాను గట్టిగా పట్టి వెనుకకు లాగిరి. పిదపా సాయిబాబని "దేవా! ఇట్లేల చేసితిరి" అని అడిగిరి. సాయిబాబా యిట్లు జవాబిచ్చే "దూరదేశాన ఒక కమ్మరి భార్య, కొలిమి తిత్తులను ఊదుచుండ తన భర్త పిలివ తన వొడిలో బిడ్డ వున్నాడన్నా సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగిడబోవ వొడిలో వున్న బిడ్డ మండుచున్న కొలిమిలో పడే. అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ అభం శుభం తెలియని పసిబిడ్డను రక్షించితిని, నా చేయి కాలుట అంత బాధాకరం కాదు, కాని ఆ పసివాడు రక్షింపబడెనన్న విషయం నాకు అమితానందం కలుగచేసే" నని సాయిబాబా తెలిపే. సాయిబాబా వారి కారుణ్యతత్వం, వారి భక్తపరయాణతత్వం యిదొక మచ్చుతునక.
1910 సంవత్సరంలో ఒకనాటి ఉదయాన షిర్డీ మసీదులో నున్న శ్రీసాయిబాబా పళ్ళు తోముకుని మొహం కడుక్కుని బాబా గోధుమలు విసురుటకు సంసిద్ధుడయ్యే. నేలపై గోనె పరచి, దానిపై తిరుగలి యుంచి చేటలో కొన్ని గోధుమలు పోసుకుని కఫనీ (చొక్కా) చేతులు పైకి మడచి, పిడికెడు చొప్పున గోధుమలు తిరగలిలో వేయుచు విసరసాగిరి. అది చూచిన హేమాద్ పంత్ “ఈ గోధుమపిండిని బాబా యేమి చేయును? ఆయన గోధుమలు ఎందుకు విసరుచుండే? అయినా భిక్షాటనంచే జీవించువారే! వారికి గోధుమపిండితో పనేమి? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే!” అనుకొనే. మసీదుకు వచ్చినా బాబాను ప్రశ్నించుటకు ధైర్యంగ అడుగుటకు ఎవరు సాహసింపలేదు. విషయం తెలిసి గ్రామంలోని ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై అక్కడకు చేరిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి సాయిబాబాను ప్రక్కకు జరిపి, వారే విసరుట ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేత పట్టుకొని, సాయిబాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి. ఆ చర్యలకు బాబాకు కోపము వచ్చినా వారి ప్రేమకు భక్తికి చాల సంతోషించి చిరునవ్వు చిందించిరి. తిరగలి విసురుతు స్త్రీలు లోలోన యిట్లనుకొనిరి. “బాబాకు ఇల్లు పిల్లలు లేరు. ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడినవారు, వారు పోషించవలసిన వారెవరును లేరు. భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. ఈ పరిస్థితులలో సాయిబాబాకు గోధుమపిండితో పనేమి? సాయిబాబా మిగుల దయమయుడవుటచే మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు” అనుకోని ఆడిన పిండిని నలుగురు స్త్రీలు నాలుగు భాగాలు చేసి తలో భాగం తీసికొనుచుండిరి. అంతవరకు శాంతముగున్న సాయిబాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లనే..
“ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టిందా? ఎవరబ్బ సొమ్మనుకొని పిండిని లూటీ చేయుచుంటిరి? ఏ కారణముచేత పిండిని తీసుకుపోవ చూచుచున్నారు? అయితే సరే, నే చెప్పినట్లు చేయుడు. ఆడిన పిండిని తీసికొనివెళ్లి గ్రామపు సరిహద్దులపైన చల్లండి”
యిదంతా వినిన వనితలు ఆశ్చర్యం కలిగి తమ ఆలోచనలకు సిగ్గుపడి, గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి సాయిబాబా అజ్ఞానుసారము ఆ పిండిని నాలుగు వైపులా చల్లిరి.
హేమాద్ పంత్ ఇదంతా చూసి షిర్డీ ప్రజలను సాయిబాబా చర్యను గూర్చి ప్రశ్నించ వారందరు ఊరిలో కలరా జాడ్యము గలదని దానిని శాంతింపచేయుటకై ఇదొక బాబా తీరు, సాధనమని చెప్పిరి. అక్కడ సాయిబాబా విసరినవి గోధుమలు కావని, వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలారనియు చెప్పిరి. అప్పటి నుండి షిర్డీ గ్రామంలో కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరు ఆనందించిరి. ఇదంతయు వినిన చూసిన హేమాద్ పంత్ కు మిక్కిలి సంతసము కలిగే. ఆ చర్యలోని గూడార్ధమును తెలియ కుతూహలం కలిగే. గోధుమపిండికి కలరా జాడ్యమునకు అసలు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యాకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొకదానినెట్లు శాంతింపజేయు? ఇదంతయు అగోచరముగా తోచే.
తిరగలి విసురుట – దాని వేదాంత తత్త్వము
తిరుగలి విసరుటను గూర్చి షిర్డీ ప్రజలు అనుకొన్న రీతియే కాక చూడ దానిలో వేదాంత భావం కూడ కలదు. సాయిబాబా షిర్డీ యందు సుమారు 60 ఏండ్లు నివసించే. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండురి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపాలు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ; పైరాయి భక్తి; చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని, ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపాలను, కోరికలను తుడిచి వేయవలయును. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవచ్చు. అహంకారమును చంపుకొనవలయును.
ఇక్కడ భక్త కభీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యొకతి తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగే . నిపతి నిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగా కభీరు ఇట్లు జవాబిచ్చే “నేను కూడ ఆ ధాన్యమువలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా?” దానికి నిపతినిరంజనుడిట్లు బదులు చెప్పెను:
“భయములేదు! తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు.”
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
No comments:
Post a Comment