జై షిర్డీ సాయినాధ by విసురజ
పదహారవ అంకం..
షిర్డీ సాయి ఆశీర్వాదం..
...ముందు అంకంలో చెప్పుకున్న గోధుములను విసిరి మరియు విసిరించి ఆపై ఆ విసిరిన పిండిని ఊరిబయట చల్లించి కలరా అనే భయంకర జాడ్యమును తరిమివేసిన సాయిబాబా వారి పవిత్ర జీవితం, వారి బోధలు.. సత్యము, ఆధ్యాత్మిక మార్గాలను చూపే.. అటువంటి మహనీయుడైన షిర్డీ సాయిబాబా వారి సత్చరిత్ర వ్రాయ సంకల్పిస్తే అది ఒక మహాయజ్ఞమే కదా! చూడబోతే "నాకు ఇష్టుడైన సన్నిహితుని జీవితచరిత్రే నాకు తెలియదు. నాలోని నాదు మనస్సే నాకు గోచరం కాకున్నది మరి షిర్డీ సాయిబాబా వంటి యోగీశ్వరునెట్లు తెలియగలం? వేదాలే వారిని పొగడలేకుండే, స్వయంగా యోగైతే గాని యోగి జీవితాన్ని గ్రహించలేడు. అలాంటప్పుడు మరి వారి మహిమలను సామాన్యుడిని నేను కీర్తించగలనా? సప్తసముద్రాల లోతును కొలవొచ్చు, ఆకాశాన్ని గుడ్డలో చుట్టివేసి మూయవచ్చు కాని సద్గురువు షిర్డీ సాయిబాబా వంటి యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట చాలా కష్టము మరియు యిది గొప్ప సాహస కార్యమని తెలుసు కాబట్టి షిర్డీనాధుని శ్రీ సాయీశ్వరుని అనుగ్రహంకై ప్రార్థించితి..
జ్ఞాన బోధలు, జ్ఞాన రచనలు
మహారాష్ట్రలోని మొట్టమొదటి కవి, యోగీశ్వరుడగు 'జ్ఞానేశ్వర' మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునన్నారు. ఏ భక్తులైతే యోగుల చరిత్రలను వ్రాయలనుకుంటారో వారి కోరికలు నెరవేరునట్లు వారి రచనలు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గాలు చూపెదరు. సిద్దయోగులే తమ మనిషిని ఎంచుకుని ప్రేరేపించి, వారి కధలను వారే స్వయంగా రచింపించుకుంటారు..దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి, వారి వారి కార్యాలను వారే కొనసాగించుకొనే. 1700 వ సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు తలచే. యోగులే అతనిని ప్రోత్సాహించి, కార్యాన్ని పూర్తిచేసిరి. మహీపతి పండితులు నాలుగు గ్రంథములను వ్రాసే. అవి భక్తవిజయము, సంత్ విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతములు.
అట్లే 1800 వ సంవత్సరంలో దాసగణు యొక్క సేవను యోగులు ఆమోదించిరి. దాసగణు వ్రాసినవి భక్తలీలామృతము సంత్ కథామృతములు. అలాగే భక్తలీలామృతములోని 31, 32, 33 అధ్యాయలందును, సంత్ కథామృతములోని 57వ అధ్యాయమందును షిర్డీ సాయిబాబా జీవితచరిత్రయు, వారి బోధలను చక్కగా చెప్పబడినవి. ఈ అధ్యాయాలు కూడ అందరు చదివితే చాల మంచిది. శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంధ్రా నివాసియగు సావిత్రిభాయి రఘునాథ్ టెండుల్కర్ చక్కని చిన్న పుస్తకములో వర్ణించారు. దాసగణు మహారాజు కూడ శ్రీ సాయి పాటలను మధురంగా వ్రాసిరి. అలాగే గుజరాత్ భాషలో శ్రీ సాయి కథలను కొంతమంది వ్రాసి వున్నారు, తెలుగులోను, మరాఠీలోను షిర్డీ సాయిబాబా లీలల గ్రంధాలను చాల వచ్చి వున్నాయి. ఇన్ని గ్రంధాలుండగా ప్రస్తుత జై షిర్డీ సాయినాధ వ్రాయుట ఎందుకనగా దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రంవలే విశాలమైనది; లోతైనది. దీనియందు మునిగి అందరు భక్తి జ్ఞానమణులను తీసుకుని కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతిని బోధించే కథలు, లీలలు అందరికి మిక్కిలి ఆశ్చర్యం కలుగించు. మనస్సు బాగాలేని వారికి మనశ్శాంతి కలుగచేయు. మోక్షానికి కావలసిన జ్ఞానం, బుద్ధిని యిచ్చును. వేదాలవలే రంజకమైన సాయిబాబా ప్రబోధలు, ఉపదేశాలన్నీ విని, వాటిని పాటించినచో భక్తులు కోరేవి పొందదెరు. సాయిబాబాను గురించి తెలియని వారికి, సమాధికి ముందు జరిగిన విషయాలు తెలియని భక్తులకు ఈ జై షిర్డీ సాయినాధ లోని సాయిలీలలు చాలా ఆనందం కలుగజేయు. అందుచే షిర్డీ సాయిబాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధనలు తెలియపరచుటకు నడుం బిగించితి. నా ఇష్టధైవమగు సాయిబాబాయే యీ కార్యానికి నన్ను ప్రోత్సహించే. నా అహంకారాన్ని వారి పాదములపై నుంచి శరణంటి. కనుక నా మార్గం సవ్యమైనదని, సాయిబాబా యిహపరసౌఖ్యాలు తప్పక ప్రసాదించునని నమ్మితి.
సాయిబాబా లీలల పుస్తకరచనకు ఆశీర్వాదం అందించుట
సాయిబాబాతో ఆయన ముఖ్యభక్తుడైన మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా ద్వారా హేమద్ పంత్ అనబడే అన్నాసాహెబ్ దభోల్కర్ సాయి జీవిత చరిత్రను (శ్రీ సాయి సత్చరిత్ర రాసిన మహానుభావుడు) వ్రాయ తలచాడని యిట్లా అడిగించే.. "భిక్షాటానపై జీవించు ఫకీరును నేను, నా జీవితచరిత్ర వ్రాయనవసరం లేదనవద్దు, మీరు సమ్మతించి సహాయపడినచో ఆ అన్నాసాహెబ్/హేమద్ పంత్ వ్రాయగలడు లేదా మీ చల్లని కృపే దానిని సిద్ధింపచేయు. మీ అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏమి ఎవరూ ఏమీ జయప్రదంగా చేయలేరు." దీనిని వినినంతనే సాయిబాబా మనస్సు కరిగి హేమద్ పంత్ కు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించే. ఆపైన షిర్డీ సాయిబాబా ఇట్లా సెలవిచ్చే "కథను, అనుభవాలను, ప్రోగుచేసి అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను టూకీగా వ్రాయమను. నేను సహాయం చేస్తాను. రాసేవాడు కారణమాత్రుడే కాని నా జీవితచరిత్ర నేనే వ్రాసుకుని నా భక్తుల కోరికలు నెరవేర్చద. రాసేవాడు తన అహంకారంను విడిచి దానిని నా పాదములపై పెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో యిలా చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడేద. వారి జీవిత చర్యలలోనే కాదు, సాధ్యమైనంతవరకు వారి గృహకార్యలందును తప్పక తోడ్పడేను. వాని అహంకారం పూర్తిగా పోయిన పిమ్మట నేను వ్రాసే వాని మనస్సులో ప్రవేశించి నా సత్ చరిత్రను నేనే వ్రాసుకొంటా. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు తప్పక కుదిరి, ఆత్మసాక్షాత్కారం బ్రహ్మానందాన్ని పొందెదరు. నీకు తోచినదే నీవు నిర్థారణ చేయుటకు ప్రయత్నించకు, యితరుల అభిప్రాయాలను కొట్టివేయుటకు ప్రయత్నించకు. ఏ విషయ మందైన కీడు, మేలు యెంచు, వివాదం కూడదు." హేమద్ పంత్ కు సాయిలీలలు వ్రాయుట సమయంలో సాయిబాబా తెలిపిన ఈ ఆణిముత్యాల సరాలను, జీవన సారాన్ని గ్రహించి, దాని అన్వయించుకుని ఈ 'జై షిర్డీ సాయినాధ' పుస్తక వ్రాయుట ముందు నేను శ్రీ షిర్డీ సాయినాధుని ముందు మ్రోకరిల్లి వారి శరణు వేడి, శ్రీ షిర్డీ సాయి అనుమతి, ఆశీర్వాదం పొందితి.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
పదహారవ అంకం..
షిర్డీ సాయి ఆశీర్వాదం..
...ముందు అంకంలో చెప్పుకున్న గోధుములను విసిరి మరియు విసిరించి ఆపై ఆ విసిరిన పిండిని ఊరిబయట చల్లించి కలరా అనే భయంకర జాడ్యమును తరిమివేసిన సాయిబాబా వారి పవిత్ర జీవితం, వారి బోధలు.. సత్యము, ఆధ్యాత్మిక మార్గాలను చూపే.. అటువంటి మహనీయుడైన షిర్డీ సాయిబాబా వారి సత్చరిత్ర వ్రాయ సంకల్పిస్తే అది ఒక మహాయజ్ఞమే కదా! చూడబోతే "నాకు ఇష్టుడైన సన్నిహితుని జీవితచరిత్రే నాకు తెలియదు. నాలోని నాదు మనస్సే నాకు గోచరం కాకున్నది మరి షిర్డీ సాయిబాబా వంటి యోగీశ్వరునెట్లు తెలియగలం? వేదాలే వారిని పొగడలేకుండే, స్వయంగా యోగైతే గాని యోగి జీవితాన్ని గ్రహించలేడు. అలాంటప్పుడు మరి వారి మహిమలను సామాన్యుడిని నేను కీర్తించగలనా? సప్తసముద్రాల లోతును కొలవొచ్చు, ఆకాశాన్ని గుడ్డలో చుట్టివేసి మూయవచ్చు కాని సద్గురువు షిర్డీ సాయిబాబా వంటి యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట చాలా కష్టము మరియు యిది గొప్ప సాహస కార్యమని తెలుసు కాబట్టి షిర్డీనాధుని శ్రీ సాయీశ్వరుని అనుగ్రహంకై ప్రార్థించితి..
జ్ఞాన బోధలు, జ్ఞాన రచనలు
మహారాష్ట్రలోని మొట్టమొదటి కవి, యోగీశ్వరుడగు 'జ్ఞానేశ్వర' మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునన్నారు. ఏ భక్తులైతే యోగుల చరిత్రలను వ్రాయలనుకుంటారో వారి కోరికలు నెరవేరునట్లు వారి రచనలు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గాలు చూపెదరు. సిద్దయోగులే తమ మనిషిని ఎంచుకుని ప్రేరేపించి, వారి కధలను వారే స్వయంగా రచింపించుకుంటారు..దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి, వారి వారి కార్యాలను వారే కొనసాగించుకొనే. 1700 వ సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు తలచే. యోగులే అతనిని ప్రోత్సాహించి, కార్యాన్ని పూర్తిచేసిరి. మహీపతి పండితులు నాలుగు గ్రంథములను వ్రాసే. అవి భక్తవిజయము, సంత్ విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతములు.
అట్లే 1800 వ సంవత్సరంలో దాసగణు యొక్క సేవను యోగులు ఆమోదించిరి. దాసగణు వ్రాసినవి భక్తలీలామృతము సంత్ కథామృతములు. అలాగే భక్తలీలామృతములోని 31, 32, 33 అధ్యాయలందును, సంత్ కథామృతములోని 57వ అధ్యాయమందును షిర్డీ సాయిబాబా జీవితచరిత్రయు, వారి బోధలను చక్కగా చెప్పబడినవి. ఈ అధ్యాయాలు కూడ అందరు చదివితే చాల మంచిది. శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంధ్రా నివాసియగు సావిత్రిభాయి రఘునాథ్ టెండుల్కర్ చక్కని చిన్న పుస్తకములో వర్ణించారు. దాసగణు మహారాజు కూడ శ్రీ సాయి పాటలను మధురంగా వ్రాసిరి. అలాగే గుజరాత్ భాషలో శ్రీ సాయి కథలను కొంతమంది వ్రాసి వున్నారు, తెలుగులోను, మరాఠీలోను షిర్డీ సాయిబాబా లీలల గ్రంధాలను చాల వచ్చి వున్నాయి. ఇన్ని గ్రంధాలుండగా ప్రస్తుత జై షిర్డీ సాయినాధ వ్రాయుట ఎందుకనగా దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రంవలే విశాలమైనది; లోతైనది. దీనియందు మునిగి అందరు భక్తి జ్ఞానమణులను తీసుకుని కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతిని బోధించే కథలు, లీలలు అందరికి మిక్కిలి ఆశ్చర్యం కలుగించు. మనస్సు బాగాలేని వారికి మనశ్శాంతి కలుగచేయు. మోక్షానికి కావలసిన జ్ఞానం, బుద్ధిని యిచ్చును. వేదాలవలే రంజకమైన సాయిబాబా ప్రబోధలు, ఉపదేశాలన్నీ విని, వాటిని పాటించినచో భక్తులు కోరేవి పొందదెరు. సాయిబాబాను గురించి తెలియని వారికి, సమాధికి ముందు జరిగిన విషయాలు తెలియని భక్తులకు ఈ జై షిర్డీ సాయినాధ లోని సాయిలీలలు చాలా ఆనందం కలుగజేయు. అందుచే షిర్డీ సాయిబాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధనలు తెలియపరచుటకు నడుం బిగించితి. నా ఇష్టధైవమగు సాయిబాబాయే యీ కార్యానికి నన్ను ప్రోత్సహించే. నా అహంకారాన్ని వారి పాదములపై నుంచి శరణంటి. కనుక నా మార్గం సవ్యమైనదని, సాయిబాబా యిహపరసౌఖ్యాలు తప్పక ప్రసాదించునని నమ్మితి.
సాయిబాబా లీలల పుస్తకరచనకు ఆశీర్వాదం అందించుట
సాయిబాబాతో ఆయన ముఖ్యభక్తుడైన మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా ద్వారా హేమద్ పంత్ అనబడే అన్నాసాహెబ్ దభోల్కర్ సాయి జీవిత చరిత్రను (శ్రీ సాయి సత్చరిత్ర రాసిన మహానుభావుడు) వ్రాయ తలచాడని యిట్లా అడిగించే.. "భిక్షాటానపై జీవించు ఫకీరును నేను, నా జీవితచరిత్ర వ్రాయనవసరం లేదనవద్దు, మీరు సమ్మతించి సహాయపడినచో ఆ అన్నాసాహెబ్/హేమద్ పంత్ వ్రాయగలడు లేదా మీ చల్లని కృపే దానిని సిద్ధింపచేయు. మీ అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏమి ఎవరూ ఏమీ జయప్రదంగా చేయలేరు." దీనిని వినినంతనే సాయిబాబా మనస్సు కరిగి హేమద్ పంత్ కు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించే. ఆపైన షిర్డీ సాయిబాబా ఇట్లా సెలవిచ్చే "కథను, అనుభవాలను, ప్రోగుచేసి అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను టూకీగా వ్రాయమను. నేను సహాయం చేస్తాను. రాసేవాడు కారణమాత్రుడే కాని నా జీవితచరిత్ర నేనే వ్రాసుకుని నా భక్తుల కోరికలు నెరవేర్చద. రాసేవాడు తన అహంకారంను విడిచి దానిని నా పాదములపై పెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో యిలా చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడేద. వారి జీవిత చర్యలలోనే కాదు, సాధ్యమైనంతవరకు వారి గృహకార్యలందును తప్పక తోడ్పడేను. వాని అహంకారం పూర్తిగా పోయిన పిమ్మట నేను వ్రాసే వాని మనస్సులో ప్రవేశించి నా సత్ చరిత్రను నేనే వ్రాసుకొంటా. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు తప్పక కుదిరి, ఆత్మసాక్షాత్కారం బ్రహ్మానందాన్ని పొందెదరు. నీకు తోచినదే నీవు నిర్థారణ చేయుటకు ప్రయత్నించకు, యితరుల అభిప్రాయాలను కొట్టివేయుటకు ప్రయత్నించకు. ఏ విషయ మందైన కీడు, మేలు యెంచు, వివాదం కూడదు." హేమద్ పంత్ కు సాయిలీలలు వ్రాయుట సమయంలో సాయిబాబా తెలిపిన ఈ ఆణిముత్యాల సరాలను, జీవన సారాన్ని గ్రహించి, దాని అన్వయించుకుని ఈ 'జై షిర్డీ సాయినాధ' పుస్తక వ్రాయుట ముందు నేను శ్రీ షిర్డీ సాయినాధుని ముందు మ్రోకరిల్లి వారి శరణు వేడి, శ్రీ షిర్డీ సాయి అనుమతి, ఆశీర్వాదం పొందితి.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
No comments:
Post a Comment