జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైవ అంకం...
(అక్షరాన్ని నిత్యం తన మస్తిష్కపు కోవెల లో దైవంగా భావించే 'విసురజ', రాసే ప్రతీ అంశాన్ని, రచనను తపస్సులా కొనసాగించే వీక్షకాభిమాన రచయిత... శ్రీ షిర్డీసాయినాథుడు సత్చరిత్రను భక్తి భావంతో సాయి భక్తులకోసం, మేన్ రోబో వీక్షకాభిమనుల కోసం, ధారావాహికగా అందిస్తున్నారు. చదివి తరించండి. మీ భక్తిభావాలను, అనుభవాలను మాతో పంచుకోండి. మీ స్పందన తెలియజేయండి.
చీఫ్ ఎడిటర్..విజయార్కె)..
................................
ప్రయాగలో దాసగణు స్నానేచ్చ.. పరిపూర్తి..
గంగానది యమునానది కలిసేచోటుకి ప్రయాగని పేరు. ఇందులో స్నానం చేస్తే ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల అపూర్వ నమ్మకం. అందుచేతనే నిత్యం వేలాది భక్తులు అచటికి పోయి స్నానమాడే. అచ్చటికిపోయి స్నానం చేయాలని దాసగణు మనస్సున దలచెను. సాయిబాబా వద్దకు పోయి అనుమతి కోరెను. అందుకు సాయిబాబా యిట్లు జవాబిచ్చె. "అంతదూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ యిచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపు." అట్లనునంతలోనే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసుగణు మహారాజు సాయిబాబా పాదాలపై శిరస్సు పెట్టిన వెంటనే సాయిబాబా రెండు పాదాల బొటనవ్రేళ్ళ నుండి గంగా యమునా నదీ జలాలు కాలువలుగా పారెను. ఈ చమత్కారంను దాసుగణు చూచి అచ్చెరవు చెందే.. భక్తి ప్రేమలతో మైమరచి కంట తడిపెట్టుకొనే. దాసగణు తన అంతరంగ ప్రేరణతో సాయిబాబాను వారి లీలలను పాట రూపముగా వర్ణించి పాడే ,
..........................
విఠలుని దర్శన దృశ్యకధ
సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును, సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. సాయిబాబా అల్లామాలిక్ అనేవారు అనగా అల్లాయే యజమాని. సాయిబాబా సప్తాహంగా ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామ స్మరణ చేయించు చుండే. దీనినే నామసప్తాహం అని కూడా అంటారు. ఒకసారి దాసుగణుని నామసప్తాహం చేయమనిరి. సప్తాహం ముగిసే నాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్ధానమిచ్చినచో నామసప్తాహంను చేస్తానని దాసుగణు జవాబిచ్చెను. షిర్డీసాయిబాబా తన గుండెపై చేయివేసి "తప్పనిసరిగ దర్శనమిచ్చు..భగవంతుడు...డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీ కృష్ణుని ద్వారకాపట్టణము, ఇక్కడనే షిర్డీలోనే వున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తిస్తే విఠలుడిక్కడనే అవతరించునని" కాకపోతే భక్తుడు భక్తి ప్రేమలతో వుండాలి అని పలికే.. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడీ ఈ క్రిందివిధముగా అందరికి దర్శనమిచ్చే. స్నానాంతరం కాకాసాహెబు దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కన్పించే. కాకా దీక్షిత్ మధ్యాహ్నహారతి కొరకు సాయిబాబా వద్దకు పోగా తేటతెల్లముగా బాబా ఇట్లడిగే.. "విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రము అజాగ్రత్తగా వున్నను తప్పించుకొని పారిపోవును." ఇది ఉదయాన జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటముల నమ్మువాడు.. 25, 30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చే. ఆ పటం సరిగ్గా కాకాసాహెబు ధ్యానంలో చూచిన దృశ్యముతో పోలియుండే. దీనిని జూచి సాయిబాబా మాటలు జ్ఞాపకానికి దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగే. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో పెట్టే.
....................................
భగవంతరావు క్షీరసాగరుని కథ
విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో, భగవంతరావు క్షీరసాగరుని కథలో చెప్పబడే. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురానికి యాత్ర చేయుచుండెడివాడు. ఇంటివద్ద కూడ విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిర్డీ వచ్చినప్పుడు, సాయిబాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకొని; "వీడి తండ్రి నా స్నేహితుడు గావున వీనిని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడ ఆకలితో మాడ్చినాడు. అందుచేత వీనిని నిక్కడకు తెచ్చితిని. వీడు చేస్తున్నది తప్పని బోధించి, చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను" అనిరి.
...................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
ఇరవైవ అంకం...
(అక్షరాన్ని నిత్యం తన మస్తిష్కపు కోవెల లో దైవంగా భావించే 'విసురజ', రాసే ప్రతీ అంశాన్ని, రచనను తపస్సులా కొనసాగించే వీక్షకాభిమాన రచయిత... శ్రీ షిర్డీసాయినాథుడు సత్చరిత్రను భక్తి భావంతో సాయి భక్తులకోసం, మేన్ రోబో వీక్షకాభిమనుల కోసం, ధారావాహికగా అందిస్తున్నారు. చదివి తరించండి. మీ భక్తిభావాలను, అనుభవాలను మాతో పంచుకోండి. మీ స్పందన తెలియజేయండి.
చీఫ్ ఎడిటర్..విజయార్కె)..
................................
ప్రయాగలో దాసగణు స్నానేచ్చ.. పరిపూర్తి..
గంగానది యమునానది కలిసేచోటుకి ప్రయాగని పేరు. ఇందులో స్నానం చేస్తే ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల అపూర్వ నమ్మకం. అందుచేతనే నిత్యం వేలాది భక్తులు అచటికి పోయి స్నానమాడే. అచ్చటికిపోయి స్నానం చేయాలని దాసగణు మనస్సున దలచెను. సాయిబాబా వద్దకు పోయి అనుమతి కోరెను. అందుకు సాయిబాబా యిట్లు జవాబిచ్చె. "అంతదూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ యిచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపు." అట్లనునంతలోనే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసుగణు మహారాజు సాయిబాబా పాదాలపై శిరస్సు పెట్టిన వెంటనే సాయిబాబా రెండు పాదాల బొటనవ్రేళ్ళ నుండి గంగా యమునా నదీ జలాలు కాలువలుగా పారెను. ఈ చమత్కారంను దాసుగణు చూచి అచ్చెరవు చెందే.. భక్తి ప్రేమలతో మైమరచి కంట తడిపెట్టుకొనే. దాసగణు తన అంతరంగ ప్రేరణతో సాయిబాబాను వారి లీలలను పాట రూపముగా వర్ణించి పాడే ,
..........................
విఠలుని దర్శన దృశ్యకధ
సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును, సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. సాయిబాబా అల్లామాలిక్ అనేవారు అనగా అల్లాయే యజమాని. సాయిబాబా సప్తాహంగా ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామ స్మరణ చేయించు చుండే. దీనినే నామసప్తాహం అని కూడా అంటారు. ఒకసారి దాసుగణుని నామసప్తాహం చేయమనిరి. సప్తాహం ముగిసే నాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్ధానమిచ్చినచో నామసప్తాహంను చేస్తానని దాసుగణు జవాబిచ్చెను. షిర్డీసాయిబాబా తన గుండెపై చేయివేసి "తప్పనిసరిగ దర్శనమిచ్చు..భగవంతుడు...డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీ కృష్ణుని ద్వారకాపట్టణము, ఇక్కడనే షిర్డీలోనే వున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తిస్తే విఠలుడిక్కడనే అవతరించునని" కాకపోతే భక్తుడు భక్తి ప్రేమలతో వుండాలి అని పలికే.. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడీ ఈ క్రిందివిధముగా అందరికి దర్శనమిచ్చే. స్నానాంతరం కాకాసాహెబు దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కన్పించే. కాకా దీక్షిత్ మధ్యాహ్నహారతి కొరకు సాయిబాబా వద్దకు పోగా తేటతెల్లముగా బాబా ఇట్లడిగే.. "విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రము అజాగ్రత్తగా వున్నను తప్పించుకొని పారిపోవును." ఇది ఉదయాన జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటముల నమ్మువాడు.. 25, 30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చే. ఆ పటం సరిగ్గా కాకాసాహెబు ధ్యానంలో చూచిన దృశ్యముతో పోలియుండే. దీనిని జూచి సాయిబాబా మాటలు జ్ఞాపకానికి దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగే. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో పెట్టే.
....................................
భగవంతరావు క్షీరసాగరుని కథ
విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో, భగవంతరావు క్షీరసాగరుని కథలో చెప్పబడే. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురానికి యాత్ర చేయుచుండెడివాడు. ఇంటివద్ద కూడ విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిర్డీ వచ్చినప్పుడు, సాయిబాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకొని; "వీడి తండ్రి నా స్నేహితుడు గావున వీనిని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడ ఆకలితో మాడ్చినాడు. అందుచేత వీనిని నిక్కడకు తెచ్చితిని. వీడు చేస్తున్నది తప్పని బోధించి, చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను" అనిరి.
...................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
No comments:
Post a Comment