జై షిర్డీ సాయినాధ by విసురజ
పద్దెనిమిది మరియు పంతొమ్మిది అంకాలు.
సాయిబాబా అనుజ్ఞ/ఆదేశం
సాయిబాబా సాయిసత్చరిత్ర వ్రాయు విషయంలో హేమాద్ పంత్ కు అనుజ్ఞ ఇస్తూ యిట్లనిరి "నీ పనిని నీవు నిర్వర్తించు, భయపడకు, మనస్సు నిలకడగా వుంచు, నా మాటయందు విశ్వాసముంచు. నా లీలలు వ్రాయంగా అజ్ఞానం, అవిద్య అంతరించి పోవు. అలాగే శ్రద్ధాభక్తులతో ఎవరైతే వింటారో వారికి ఈ లోకం పట్ల మమత తగ్గి విముఖత పెరుగు. నీ మనసులో బలమైన భక్తి ప్రేమ కెరటాలు లేచు. ఎవరయితే నా లీలలలో మునిగితేలుతారో వారికి జ్ఞానరత్నాలు లభించు."
సాయి భక్తుడు, హేమాద్ పంత్ స్నేహితుడైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి సాయిబాబా యిట్లనే....
"ప్రేమతో వుచ్చరించిన నా నామాన్ని ఆ భక్తుల కోరికలన్నియు నెరవేర్చెదా. వారి మనసులో భక్తిని పెంచెదను. అన్ని వైపులా నుంచి కాపు కాసి నా భక్తులని కాపాడెదను. ఏ ఏ భక్తులయితే మనఃపూర్వకంగా నాపై ఆధారపడివుంటారో నా కథలు వారు వినునప్పుడు మిక్కిలి సంతోషిస్తారు. నా లీలలు పాడు వారికి అంతులేని ఆనందాన్ని శాశ్వతమైన తృప్తిని యిచ్చెదనని నమ్ము. ఎవరయితే నన్ను శరణాగతని వేడుతారో, నన్ను భక్తి విశ్వాసాలతో పూజిస్తారో, నన్నే నిత్యం స్మరిస్తారో, నా ఆకారాన్ని మనస్సున నిలుపుతారో సదరు భక్తులని జీవన బంధనాల నుండి తప్పించుటే నా ముఖ్య లక్షణము. అన్నిటిని మరిచి లోకాన నా నామాన్నే జపించి, నా పూజనే చేస్తూ, నా లీలల కథలను తలుస్తూ సదా నన్ను మరువనివారు ప్రాపించిక విషయాలను ఎట్లా తగులుకొందురు? వారిని మరణం నుండి కూడా బయటకు లాగెద. నా కథలే వినడంతోనే సకల రోగముల నివారణ జరుగు. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినండి. వాటిని మనసులో నిలపుకోండి. పరమానందంకి తృప్తికిదే సిసలైన మార్గం. ఈ రీతిగా నా భక్తుల యొక్క గర్వాహంకారాలు నిష్క్రమించు. మనస్ఫూర్తిగా నమ్మేవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగు. సాయి, సాయి అన్న నామాన్ని జ్ఞప్తి వుంచుకుంటే చెడు పలుకుట వినుట వలన కలుగు పాపాలు తొలగిపోవు'' అని తెలిపే..
సాయిబాబా లీల
సాయిబాబా విచిత్ర లీలలలో మరొకటి.... అమరావతి నివాసైన దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో షిర్డీలో మకాం చేసే. ఆ పిల్లవాడికి జ్వరం వచ్చే అది ప్లేగు జ్వరం క్రింద మార్పు చెందే. ఆ పిల్లవాడి తల్లి మిక్కిలి భయపడే..షిర్డీ విడచి అమరావతి
పోవాలనుకుని, సాయంకాలం సాయిబాబా బూటీవాడా వద్దకు చేరినప్పుడు వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగు జ్వరంతో పడియున్నాడని సాయిబాబాకు చెప్పి వారి సెలవు కోరెను. ఆమెపై దయతో సాయిబాబా యిట్లనే "ఇప్పుడు ఆకాశాన్ని మేఘాలు కప్పినా తొందోర్లోనే అవన్నీ చెదిరిపోయి కొద్ది సేపట్లో నింగంతా మామూలుగా మారుననే". అలా అంటూ సాయిబాబా తన కఫనీని పైకెత్తి చంకలో కోడి గుడ్లంతా నాలుగు పెద్ద ప్లేగు పొక్కులును అచటవారికి చూపే. "చూస్తున్నారా! నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడుతున్నానో! భక్తుల కష్టములన్ని నావిగనే భావించెద." ఈ మహాద్భుత లీలను జూచి సాయి యోగీశ్వరులు తమ భక్తులకొరకెట్లు బాధలను అనుభవిస్తారో జనులకు విశ్వాసం కుదిరెను. యోగీశ్వరుల మనస్సు మైనంకన్నా మెత్తనిది, వెన్నెలలా మృదువైనది. యోగీశ్వరులు తమ భక్తులను ప్రత్యుపకారం అడగకనే ప్రేమించెదరు, భక్తులను తమ బంధువులవలే జూచెదరు.
సాయిబాబా లీల... పండరీపురేశ్వర పోవుట...భజన..
సాయిబాబా తన భక్తుల కోరికలను, అవసరాలనెట్లు గ్రహించునో ఈ కధ వివరించు.
నానాసాహెబు చాందోర్కరు సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని మామలత్ దారు. అతనికి పండరీపురానికి బదిలీ జరిగెను, పండరీపురాన్ని భూలోక వైకుంఠమంటారు. అట్టి స్థలమునకు బదిలీ అవ్వటంతో ధన్యుడై వెంటనే పండరీపురం పోయి ఉద్యోగంలో చేరవలే. అందుచే వుత్తరమైనా రాయక వెంటనే షిర్డీకి మీదుగా పండరీపురం పోవలెనని బయలుదేరే. తన విఠోబాయగు షిర్డీసాయిని దర్శించి ఆపై పండరీ పోదామని బయలుదేరే. నానాసాహెబు షిర్డీ రావచ్చునన్న సంగతి యెవరికి తెలియదు కాని సాయిబాబా సర్వజ్ఞుడగుటచే విషయం గ్రహించెను. నానాసాహెబు నీమగాం గ్రామం చేరే సమయానికి సాయిబాబా మసీదులో కూర్చుండి మహాళ్సాపతి, అప్పా షిందే, కాశీరామ్ లతో మాట్లాడుచుండెను. అకస్మాత్తుగా సాయిబాబా వారితో యిట్లనియే "మన నలుగురం కలసి భజన చేసెదము. పండరీద్వారాలూ తెరచినారు, కనుక ఆనందంగా పాడుదాం" అంటూ మసీదులో వున్న వారందరితో కలసి పాట పాడసాగే.. ఆ పాట భావం ఏమిటంటే "నేను పండరి పోవలెను. నే నక్కడ నివసించవలెను. అది నా దైవము యొక్క భవనము."
కొద్దిసేపటికి నానా చాందోర్కర్ తన కుటుంబంతో వచ్చి సాయిబాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, తన విఠోబా అయిన సాయిబాబాను పండరీపురం వచ్చి తమతో కలసి అక్కడుండుమని వేడుకొనే. అంత మసీదులోని భక్తులు షిర్డీ సాయిబాబా అప్పటికే పండరీపురం పోవలె; అచ్చట వుండవలెనన్న భావమును వెలిబుచ్చుచుండెనని నానాతో చెప్పిరి. అది విన్న నానా మనస్సు కరిగి సాయిబాబా పాదాలపై వ్రాలే. అనంతరం సాయిబాబా ఆజ్ఞను పొంది, ఊదీ ప్రసాదంను గ్రహించి, సాయిబాబా ఆశీర్వాదం పొందిన పిదపే నానాసాహెబు చాందోర్కర్ పండరీకి ఉద్యోగమందు ప్రవేశించుటకు పోయెను. ఇట్టి సాయిబాబా లీలల కంతులేదు.
.......................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
పద్దెనిమిది మరియు పంతొమ్మిది అంకాలు.
సాయిబాబా అనుజ్ఞ/ఆదేశం
సాయిబాబా సాయిసత్చరిత్ర వ్రాయు విషయంలో హేమాద్ పంత్ కు అనుజ్ఞ ఇస్తూ యిట్లనిరి "నీ పనిని నీవు నిర్వర్తించు, భయపడకు, మనస్సు నిలకడగా వుంచు, నా మాటయందు విశ్వాసముంచు. నా లీలలు వ్రాయంగా అజ్ఞానం, అవిద్య అంతరించి పోవు. అలాగే శ్రద్ధాభక్తులతో ఎవరైతే వింటారో వారికి ఈ లోకం పట్ల మమత తగ్గి విముఖత పెరుగు. నీ మనసులో బలమైన భక్తి ప్రేమ కెరటాలు లేచు. ఎవరయితే నా లీలలలో మునిగితేలుతారో వారికి జ్ఞానరత్నాలు లభించు."
సాయి భక్తుడు, హేమాద్ పంత్ స్నేహితుడైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి సాయిబాబా యిట్లనే....
"ప్రేమతో వుచ్చరించిన నా నామాన్ని ఆ భక్తుల కోరికలన్నియు నెరవేర్చెదా. వారి మనసులో భక్తిని పెంచెదను. అన్ని వైపులా నుంచి కాపు కాసి నా భక్తులని కాపాడెదను. ఏ ఏ భక్తులయితే మనఃపూర్వకంగా నాపై ఆధారపడివుంటారో నా కథలు వారు వినునప్పుడు మిక్కిలి సంతోషిస్తారు. నా లీలలు పాడు వారికి అంతులేని ఆనందాన్ని శాశ్వతమైన తృప్తిని యిచ్చెదనని నమ్ము. ఎవరయితే నన్ను శరణాగతని వేడుతారో, నన్ను భక్తి విశ్వాసాలతో పూజిస్తారో, నన్నే నిత్యం స్మరిస్తారో, నా ఆకారాన్ని మనస్సున నిలుపుతారో సదరు భక్తులని జీవన బంధనాల నుండి తప్పించుటే నా ముఖ్య లక్షణము. అన్నిటిని మరిచి లోకాన నా నామాన్నే జపించి, నా పూజనే చేస్తూ, నా లీలల కథలను తలుస్తూ సదా నన్ను మరువనివారు ప్రాపించిక విషయాలను ఎట్లా తగులుకొందురు? వారిని మరణం నుండి కూడా బయటకు లాగెద. నా కథలే వినడంతోనే సకల రోగముల నివారణ జరుగు. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినండి. వాటిని మనసులో నిలపుకోండి. పరమానందంకి తృప్తికిదే సిసలైన మార్గం. ఈ రీతిగా నా భక్తుల యొక్క గర్వాహంకారాలు నిష్క్రమించు. మనస్ఫూర్తిగా నమ్మేవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగు. సాయి, సాయి అన్న నామాన్ని జ్ఞప్తి వుంచుకుంటే చెడు పలుకుట వినుట వలన కలుగు పాపాలు తొలగిపోవు'' అని తెలిపే..
సాయిబాబా లీల
సాయిబాబా విచిత్ర లీలలలో మరొకటి.... అమరావతి నివాసైన దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో షిర్డీలో మకాం చేసే. ఆ పిల్లవాడికి జ్వరం వచ్చే అది ప్లేగు జ్వరం క్రింద మార్పు చెందే. ఆ పిల్లవాడి తల్లి మిక్కిలి భయపడే..షిర్డీ విడచి అమరావతి
పోవాలనుకుని, సాయంకాలం సాయిబాబా బూటీవాడా వద్దకు చేరినప్పుడు వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగు జ్వరంతో పడియున్నాడని సాయిబాబాకు చెప్పి వారి సెలవు కోరెను. ఆమెపై దయతో సాయిబాబా యిట్లనే "ఇప్పుడు ఆకాశాన్ని మేఘాలు కప్పినా తొందోర్లోనే అవన్నీ చెదిరిపోయి కొద్ది సేపట్లో నింగంతా మామూలుగా మారుననే". అలా అంటూ సాయిబాబా తన కఫనీని పైకెత్తి చంకలో కోడి గుడ్లంతా నాలుగు పెద్ద ప్లేగు పొక్కులును అచటవారికి చూపే. "చూస్తున్నారా! నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడుతున్నానో! భక్తుల కష్టములన్ని నావిగనే భావించెద." ఈ మహాద్భుత లీలను జూచి సాయి యోగీశ్వరులు తమ భక్తులకొరకెట్లు బాధలను అనుభవిస్తారో జనులకు విశ్వాసం కుదిరెను. యోగీశ్వరుల మనస్సు మైనంకన్నా మెత్తనిది, వెన్నెలలా మృదువైనది. యోగీశ్వరులు తమ భక్తులను ప్రత్యుపకారం అడగకనే ప్రేమించెదరు, భక్తులను తమ బంధువులవలే జూచెదరు.
సాయిబాబా లీల... పండరీపురేశ్వర పోవుట...భజన..
సాయిబాబా తన భక్తుల కోరికలను, అవసరాలనెట్లు గ్రహించునో ఈ కధ వివరించు.
నానాసాహెబు చాందోర్కరు సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని మామలత్ దారు. అతనికి పండరీపురానికి బదిలీ జరిగెను, పండరీపురాన్ని భూలోక వైకుంఠమంటారు. అట్టి స్థలమునకు బదిలీ అవ్వటంతో ధన్యుడై వెంటనే పండరీపురం పోయి ఉద్యోగంలో చేరవలే. అందుచే వుత్తరమైనా రాయక వెంటనే షిర్డీకి మీదుగా పండరీపురం పోవలెనని బయలుదేరే. తన విఠోబాయగు షిర్డీసాయిని దర్శించి ఆపై పండరీ పోదామని బయలుదేరే. నానాసాహెబు షిర్డీ రావచ్చునన్న సంగతి యెవరికి తెలియదు కాని సాయిబాబా సర్వజ్ఞుడగుటచే విషయం గ్రహించెను. నానాసాహెబు నీమగాం గ్రామం చేరే సమయానికి సాయిబాబా మసీదులో కూర్చుండి మహాళ్సాపతి, అప్పా షిందే, కాశీరామ్ లతో మాట్లాడుచుండెను. అకస్మాత్తుగా సాయిబాబా వారితో యిట్లనియే "మన నలుగురం కలసి భజన చేసెదము. పండరీద్వారాలూ తెరచినారు, కనుక ఆనందంగా పాడుదాం" అంటూ మసీదులో వున్న వారందరితో కలసి పాట పాడసాగే.. ఆ పాట భావం ఏమిటంటే "నేను పండరి పోవలెను. నే నక్కడ నివసించవలెను. అది నా దైవము యొక్క భవనము."
కొద్దిసేపటికి నానా చాందోర్కర్ తన కుటుంబంతో వచ్చి సాయిబాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, తన విఠోబా అయిన సాయిబాబాను పండరీపురం వచ్చి తమతో కలసి అక్కడుండుమని వేడుకొనే. అంత మసీదులోని భక్తులు షిర్డీ సాయిబాబా అప్పటికే పండరీపురం పోవలె; అచ్చట వుండవలెనన్న భావమును వెలిబుచ్చుచుండెనని నానాతో చెప్పిరి. అది విన్న నానా మనస్సు కరిగి సాయిబాబా పాదాలపై వ్రాలే. అనంతరం సాయిబాబా ఆజ్ఞను పొంది, ఊదీ ప్రసాదంను గ్రహించి, సాయిబాబా ఆశీర్వాదం పొందిన పిదపే నానాసాహెబు చాందోర్కర్ పండరీకి ఉద్యోగమందు ప్రవేశించుటకు పోయెను. ఇట్టి సాయిబాబా లీలల కంతులేదు.
.......................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
No comments:
Post a Comment